ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జనవరి 17) మందకోడిగా ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 23.37 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 14.30 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. హెచ్సీఎల్ టెక్, భారతీ ఇన్ఫ్రాటెల్, వొడాఫోన్ ఐడియా, ఎస్బీఐ, యస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
కార్పోరేట్ సంస్థల ఆదాయాల అంచనాలపై సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. అదే సమయంలో AGR ఛార్జీల చెల్లింపుపై టెల్కోలు వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం కూడా ప్రభావితం చేసింది. మధ్యాహ్నం గం.11.34 సమయానికి సెన్సెక్స్ 32.10 (0.077%) పాయింట్ల లాభంతో 41,964.66 వద్ద, నిఫ్టీ 1.90 (0.015%) పాయింట్ల నష్టంతో 12,353.60 వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, గెయిల్, కోల్ ఇండియా ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు 22 శాతానికి పైగా కుంగింది. అదే సమయంలో ఎయిర్టెల్ షేర్లు (4 శాతం) లాభాల్లో ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications