12,000 పాయింట్లకు పైగా నిఫ్టీ, 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయానికి సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.69 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా - చైనా వాణిజ్య ఒప్పందం ఫలప్రదం కానుందనే సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి.
దీంతో భారత్ సహా ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం గం.11.24 నిమిషాలకు సెన్సెక్స్ 309.02 (0.76%) పాయింట్లు పెరిగి 40,890.73 వద్ద, నిఫ్టీ 70.55 (0.59%) పాయింట్లు ఎగిసి 12,042.35 వద్ద ట్రేడ్ అయింది.
టాప్ గెయినర్స్ టాటా మోటార్స్, వేదాంత, యాక్సిస్ బ్యాంకు, హిండాల్కో, యస్ బ్యాంకులు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్, భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, జీఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. ఫార్మా రంగం మినహా దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, ఐటీ, ఇన్ఫ్రా, ఐటీ రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.