లాభాల్లో స్టాక్ మార్కెట్లు: 400 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 12,100 దాటి ప్రారంభమైంది. దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ట్రేడింగ్ను ప్రారంభించాయి.
టాప్ 20 స్మార్ట్ సిటీల్లో అమరావతి: విశాఖ-డయ్యూ సిస్టర్ సిటీలు
ఐటీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రా టెక్, ఎస్బీఐ, హీరో మోటా కార్ప్, ఐసీఐసీ, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్ట్లే, హిందూస్తాన్ యూనీ లీవర్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇలా అన్నీ లాభాల్లోనే ప్రారంభించాయి.
ఉదయం గం.10.27 సమయానికి సెన్సెక్స్ 400.17 (0.98%) పాయింట్లు ఎగిసి 41,379.79 వద్ద, నిఫ్టీ 122.15 (1.02%) పాయింట్లు ఎగిసి 12,153.65 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.27 వద్ద ఉంది. కీలక షేర్లు అన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. చైనా నుండి పుట్టుకు వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా కొద్ది రోజులుగా మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి.