ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 19) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 315.34 పాయింట్లు లేదా 1.05% ఎగిసి 30,344.32 వద్ద, నిఫ్టీ 92.10 పాయింట్లు లేదా 1.04% పెరిగి 8,915.35 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 534 షేర్లు లాభాల్లో 136 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 27 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ 500 పాయింట్లు కూడా దాటింది. నిన్నటి వరకు ప్యాకేజీ ప్రభావం ఏమీ కనిపించలేదు. కానీ ఈ రోజు మళ్లీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం గం.10.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యు స్టీల్, అదాని పోర్ట్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, వేదాంత, హిందూస్తాన్ యూనీ లీవర్ ఉన్నాయి. బ్యాంకు, ఆటో, మెటల్ రంగాల నుండి మద్దతు కారణంగా స్టాక్స్ ఈ రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోడీ గత మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. దీంతో మరుసటి రోజు మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. అయితే ఆ రోజు సాయంత్రం నుండి నిర్మలా సీతారామన్ ఉద్దీపనలకు సంబంధించిన వివరాలను ఐదు రోజుల పాటు వరుసగా ప్రకటించింది. కానీ నిర్మల ప్యాకేజీ మార్కెట్కు రుచించలేదు. దీంతో గురువారం నుండి మార్కెట్లు నష్టపోతున్నాయి. ఆదివారం చివరి ప్యాకేజీ ప్రకటించారు. దీంతో నిన్న.. సోమవారం వరకు నష్టాలే చూశాయి. ఈ రోజు కాస్త కోలుకుంటున్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications