నిన్న భారీ నష్టం తర్వాత నేడు లాభాల్లోకి మార్కెట్లు, బలపడిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఏప్రిల్ 5) పుంజుకున్నాయి. సోమవారం భారీ నష్టాల అనంతరం ఈ రోజు ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 441.39 పాయింట్లు లేదా 1.39% ఎగిసి 32,156.74 వద్ద, నిఫ్టీ 129.60 పాయింట్లు లేదా 1.39% ఎగిసి 9,423.10 వద్ద ట్రేడ్ అయింది. 541 షేర్లు లాభాల్లో, 122 షేర్లు నష్టాల్లో ఉండగా 30 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. రూపాయి 9 పైసలు ఎగబాకి 75.62 వద్ద ప్రారంభమైంది. సోమవారం 75.71 వద్ద క్లోజ్ అయింది.
COVID 19: బజాజ్ ఆటో సేల్స్, ఐనా ఉద్యోగులకు శాలరీపై గుడ్న్యూస్
ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐటీసీ, టాటా స్టీల్, ఇన్పోసిస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, టైటాన్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంకు, అల్ట్రా సిమెంట్, సన్ ఫార్మా, హిందూస్తాన్ యూనీ లీవర్ లాభాల్లో ఉండగా, హీరో మోటో కార్ప్, హెచ్డీఎఫ్సీ, నెస్ట్లే, కొటక్ బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 2002.27 పాయింట్లు, నిఫ్టీ 566.40 పాయింట్లు నష్టపోయింది. అమెరికా - చైనా ట్రేడ్ వార్, లాక్ డౌన్ పొడిగింపు, నిరాశాజనక ఆటో సేల్స్ వంటి వాటి ప్రభావం పడింది. నిన్న బలహీనపడిన రూపాయి ఈ రోజు పుంజుకుంది.