For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 31,000 మార్క్ దాటిన సెన్సెక్స్

|

ముంబై: నిన్న (ఏప్రిల్ 8) నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం లాభాల్లోకి వచ్చాయి. ఈ రోజు ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 748.97 పాయింట్లు (2.51%) లాభపడి 30,642.93 వద్ద, నిఫ్టీ 217.45 పాయింట్లు (2.49%) ఎగిసి 8,966.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కొద్ది సమయానికి సెన్సెక్స్ 833 పాయింట్లు ఎగిసి 30,727కు చేరుకుంది. నిఫ్టీ 9వేల పాయింట్లు దాటింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,131 పాయింట్లు ఎగిసి 31,000 మార్క్ కూడా దాటింది.

764 షేర్లు లాభాల్లో, 82 షేర్లు నష్టాల్లో ఉండగా 25 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు అన్ని రంగాలు కూడా ఈ రోజు లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం పెరిగాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో షేర్లు 5 శాతం మేర లాభాల్లోకి వచ్చాయి. బీఎస్ఈలోను అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.

అగాధంలో రూ.3,65,100 కోట్లు! హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుదేలు, ఏ నగరంలో ఎంతంటే?అగాధంలో రూ.3,65,100 కోట్లు! హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుదేలు, ఏ నగరంలో ఎంతంటే?

Market: Sensex above 30,000, Nifty around 9,000

ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించే అవకాశముందని వార్తలు రావడంతో బుధవారం మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. లాక్ డౌన్ పొడిగిస్తే కేంద్రం మరోసారి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని వార్తలు రావడంతో ఈ రోజు లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం కూడా పడింది.

English summary

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 31,000 మార్క్ దాటిన సెన్సెక్స్ | Market: Sensex above 30,000, Nifty around 9,000

All the sectoral indices are trading in the green. BSE Midcap and Smallcap indices rose over 2 percent each.
Story first published: Thursday, April 9, 2020, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X