SEBI News: ఇన్వెస్టర్ల కోసం సెబీ కీలక నిర్ణయం.. జనవరి 1, 2024 నుంచి అమలులోకి..

SEBI News: దేశంలోని స్టాక్ మార్కెట్ల పనితీరును మెరుగుపరిచేందుకు రెగ్యులేటరీ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు నూతన పరిష్కారాలతో ముందుకు వస్తోంది. తాజాగా పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం సెంట్రలైజ్డ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది.

ఇకపై పెట్టుబడిదారుడి మరణాన్ని నివేదించడానికి, ధృవీకరించడానికి సెంట్రలైజ్డ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. సెక్యూరిటీల మార్కెట్‌లో ఆస్తులను బదిలీ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యంగా ఉంది. ఈ సర్క్యూలర్ జనవరి 01, 2024 నుంచి అమలులోకి వస్తుందని సెబీ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ మరణానికి సంబంధించిన వివరాలను బ్రోకరేజ్ అందుకున్న తర్వాత ముందుగా నోటిఫైయర్ నుంచి పాన్‌తో పాటు మరణ ధృవీకరణ పత్రాన్ని పొందవలసి ఉంటుంది.

Market Regulator SEBI introdusing Centralised system to report verify investor death

మరణ ధృవీకరణ పత్రాన్ని ధృవీకరించే ప్రక్రియను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేయవచ్చుని సెబీ వెల్లడించింది. ఇందులో సంబంధింత పత్రాలను రికార్డు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడి మరణానికి సంబంధించిన సమాచారాన్ని పొందిన తర్వాత మరణ ధృవీకరణ పత్రాన్ని బ్రోకరేజ్ అందుకోని పక్షంలో సదరు ఇన్వెస్టర్ కేవైసీ స్థితిని 'ఆన్ హోల్డ్'గా కేటాయిస్తుంది.

ముఖ్యంగా KYC స్థితి నవీకరించబడిన తర్వాత మరణించిన పెట్టుబడిదారు ఖాతా/ఫోలియోల్లోని అన్ని డెబిట్ లావాదేవీలు బ్లాక్ చేయబడతాయి. ఇదే క్రమంలో ఖాతా ఉమ్మడి ఖాతాగా లేదా సర్వైవర్ మోడ్‌లో నిర్వహించబడుతున్నట్లయితే సదరు అకౌంట్ ఆపరేషన్ కొనసాగుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+