భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, బలపడిన రూపాయి
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 31) లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం సెన్సెక్స్ 1,375 పాయింట్లు నష్టపోయి 28,440 వద్ద, నిఫ్టీ 379 పాయింట్లు కోల్పోయి 8,281 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు లాభాల్లో ఆరంభించాయి. ప్రీఓపెన్ మార్కెట్లో సెన్సెక్స్ 622 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 290 పాయింట్లు లాభపడింది.
రూపాయి 9 పైసలు బలపడి 75.52 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్లో 75.61 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఉదయం గం.09:19 సమయానికి 550.55 పాయింట్లు (1.94%) ఎగిసి 28,990.87 వద్ద, నిఫ్టీ 174.50 పాయింట్లు (2.11%) లాభపడి 8,455.60 వద్ద ప్రారంభమైంది. 513 షేర్లు లాభాల్లో, 82 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 27 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. హిండాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యు స్టీల్, వేదాంత, టెక్ మహీంద్రా లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
18 ఏళ్ల కనిష్టానికి చమురు ధరలు, సామాన్యుడికి మాత్రం తగ్గని పెట్రో భారం! ఎందుకంటే?