2019-20లో రూ.37.60 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనా దెబ్బతో మార్చిలోనే అత్యధికం

ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.37.59 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 9,204.42 పాయింట్లు లేదా 24 శాతం, నిఫ్టీ 3,026.15 పాయింట్లు లేదా 26.03 శాతం నష్టపోయాయి. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2020 మార్చి 31వ తేదీ వరకు ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు నెలల్లోనే మార్కెట్లు కుప్పకూలాయి.

మార్చిలోనే అత్యధిక నష్టం

మార్చిలోనే అత్యధిక నష్టం

మంగళవారంతో (మార్చి 31) ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.37.60 లక్షల కోట్ల సంపదను కోల్పోయినప్పటికీ.. ఇందులో అత్యధిక శాతం నష్టాలు వాటిల్లింది మార్చి నెలలోనే. కరోనా ప్రభావం భారత్‌పై కూడా చూపింది. ఇది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లు గతంలో లేనివిధంగా నష్టపోయాయి.

అందుకే... 37.59 లక్షల కోట్లు ఆవిరి

అందుకే... 37.59 లక్షల కోట్లు ఆవిరి

BSE లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ రూ.37,59,954.42 కోట్లు ఆవిరై రూ.1,13, 48, 756.59 కోట్లకు పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టించడం, ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే పరిస్థితులు కనిపించడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్ పైనా కరోనా ప్రభావం కనిపించడం ఆందోళన కలిగించింది.

సెన్సెక్స్ రెండు నెలల్లో 16వేల పాయింట్లు డౌన్

సెన్సెక్స్ రెండు నెలల్లో 16వేల పాయింట్లు డౌన్

ఈ ఏడాది జనవరి 20వ తేదీన 42,273.87 పాయింట్లతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ మార్చి 24న 25,638.90 పాయింట్లకు పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో 16,635 పాయింట్లు నష్టపోయింది.

నిఫ్టీ కూడా..

నిఫ్టీ కూడా..

నిఫ్టీ కూడా గతంలో ఎన్నడూలేని విధంగా 12,000 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. ఓ దశలో 8,000 దిగువకు వచ్చింది. నిన్న (మార్చి 31) సెన్సెక్స్ 1,000 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 8,600కు ఎగబాకింది. గత వారం కాస్త కుదురుకున్నట్లుగా కనిపించినా ఈ వారంలో సోమవారం భారీగా నష్టపోయాయి. తిరిగి మంగళవారం కాస్త ఊరట కలిగింది.

రెండేళ్లలో ఇలా..

రెండేళ్లలో ఇలా..

2018-19 ఆర్థిక సంవత్సరంలో BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.8.84 లక్షల కోట్లు పెరిగింది. 2019-20లో రూ.37.60 లక్షల కోట్ల సంపద నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ రూ.7,05,211.81 కోట్ల మార్కెట్ వ్యాల్యూతో మొదటి స్థానంలో ఉంది. రూ.6,84,078.49 కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. గత ఏడాది నవంబర్ నెలలో రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ రికార్డ్ సృష్టించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+