ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం(సెప్టెంబర్ 11) ప్లాట్గా ముగిశాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 82.88 పాయింట్లు లేదా 0.21 శాతం తగ్గి 38,757.44 వద్ద, నిఫ్టీ 15.50 పాయింట్లు లేదా 0.14 శాతం తగ్గి 11,433.80 వద్ద ప్రారంభమైంది. స్వల్ప లాభ, నష్టాల మధ్యే మార్కెట్లు ఊగిసలాడాయి. చివరకు సెన్సెక్స్ కేవలం 14 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 38,854 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 11,464 వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు వరుసగా 0.58 శాతం, 0.52 శాతం పెరిగాయి

ఐటీ రంగం జూమ్
ఐటీ, రియాల్టీ, బ్యాంకింగ్ రంగాలు మంచి లాభాలు చూశాయి. టెలికం ఇండెక్స్ మాత్రం దాదాపు ఒక శాతం నష్టపోయింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఐటీ షేర్లు ముందున్నాయి. ఈ రోజు ఐటీ షేర్లు భారీగా ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టీసీఎస్, యూపీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి. ఈ రోజు నిఫ్టీ ఐటీ భారీగా లాభపడింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 73.53 వద్ద క్లోజ్ అయింది. గురువారం 73.46 వద్ద క్లోజ్ కాగా, ఈ రోజు 7 పైసలు నష్టంతో ముగిసింది.

విప్రో అదుర్స్
విప్రో ఏకంగా 3 శాతానికి పైగా ఎగిసింది. ఎస్బీఐ దాదాపు 3 శాతం, టెక్ మహీంద్రా 1.76 శాతం, టీసీఎస్ 1.69 సాతం, హిందూస్తాన్ యూనీలీవర్ 1.19 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.03 శాతం, కొటక్ మహీంద్రా 0.97 శాతం, టైటాన్ 0.88 శాతం, ఇన్ఫోసిస్ 0.54 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.19 శాతం, బజాజ్ ఆటో 0.12 శాతం, రిలయన్స్ 0.06 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 14 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 113 పాయింట్లు లాభపడ్డాయి.
భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ మార్కెట్లను కిందకు లాగాయి.
విప్రో ఏకంగా 3 శాతానికి పైగా ఎగిసి 52 వారాల గరిష్టానికి చేరుకుంది.
అదానీ గ్రీన్ అప్పర్ సర్క్యూట్ సమీపంలో ముగిసింది. అదానీ గ్రీన్ మంచి లాభాలను, రెవెన్యూను ప్రకటించింది.
మ్యాక్స్ హెల్త్ అయితే 17 శాతం లాభపడింది. కోపోర్జ్ తో డీల్ అనంతరం ఈ షేర్ వ్యాల్యూ పెరిగింది. జుబిలాంట్ ఫుడ్, టాటా ఎల్ఎక్సీ 52 వారాల గరిష్టానికి చేరుకుంది.

ఈ వారం టాప్ రిలయన్స్
ఈ వారంలో నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా ఎగిసింది. నిఫ్టీ బ్యాంకు, మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా ఈ వారంలో లాభపడ్డాయి. ఈ వారంలో భారీగా లాభపడిన షేర్గా రిలయన్స్ ముందు ఉంది. ఈ షేర్ వ్యాల్యూ ఏకంగా 11 శాతం పెరిగింది. రిలయన్స్ రిటైల్ లోకి అమెజాన్ పెట్టుబడులు రావొచ్చునని భావిస్తున్నారు. అలాగే కేకేఆర్ పెట్టుబడులు పెడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఈ షేర్ వ్యాల్యూ భారీగా పెరిగింది. గత ఏడు వారాల్లోనే ఇది గరిష్ట జంప్.
ఈ వారం నిఫ్టీ బ్యాంక్ 2.3 శాతం, మిడ్ క్యాప్ 1 శాతం మేర నష్టపోయింది. విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, ఏషియన్ పేయింట్స్ కూడా లాభపడ్డాయి. గెయిల్, భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, ఈ వారం టాప్ లూజర్స్.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications