Stock Market: ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం ప్రతి నిమిషానికి పెరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో ఆర్ఎస్ఎస్ అడ్డా వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉండటంతో మార్కెట్ల పతనం కొనసాగుతోంది.
ఇదే క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ముందంజలో ఉండటం మార్కెట్లపై కీలక ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కేవలం 15 నిమిషాల్లోనే భారత ఈక్విటీ మార్కెట్ల విలువ ఏకంగా రూ.14 లక్షల కోట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగుతోంది.

ఉదయం 9.51 గంటల సమయంలో మార్కెట్లు నష్టాల నుంచి కొంత తేరుకున్న తర్వాత సెన్సెక్స్ సూచీ 1751 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ సూచీ 523 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగ్ నిఫ్టీ బ్యాంక్ సూచీ 1649 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1498 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.
ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం NDA సులభంగా విజయం సాధించకపోవడంతో నిఫ్టీ పతనమైంది. ఈ క్రమంలో గౌతమ్ అదానీకి చెందిన లిస్టెడ్ కంపెనీలు పతనంలో కొనసాగుతున్నాయి. నిన్న భారీ ర్యాలీని నమోదు చేసిన అదానీ గ్రూప్ కంపెనీలు నేడు మాత్రం దెబ్బతిన్నాయి. నేడు ప్రారంభ ట్రేడింగ్లో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు, అదానీ గ్రూప్లోని కీలక షేర్లు నష్టపోయాయి. వాస్తవానికి ఈ స్టాక్స్ సోమవారం అత్యధికంగా లాభపడ్డాయి.
జూన్ 3వ తేదీన మార్కెట్ ఎన్నికల ఫలితాలను తగ్గించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 350-375 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తోంది. ఈ సంఖ్య నిజమైతే మార్కెట్ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని ఈక్విటీ డైరెక్టర్ క్రాంతి బథిని అన్నారు. రెండవ రౌండ్ పూర్తయ్యాక వారణాసిలో మోదీ స్వల్పంగా 400 పైచిలుకు ఓట్ల మెజారిటీతో కొనసాగటం మార్కెట్లకు కొంత ఊరటను కలిగించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications