5 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.67,843 కోట్లు జంప్
టాప్ 10 కంపెనీల్లోని ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.67,843 కోట్లు పెరిగింది. హిందూస్తాన్ యూవీలీవర్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 57,000 పాయింట్లకు పైన ముగిసింది. రిలయన్స్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, భారతీ ఎయిర్ టెల్, HDFC మార్కెట్ క్యాప్ పెరిగింది. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ గ్రీన్ ఎనర్జీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ నష్టపోయాయి.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.25,234.61 కోట్లు పెరిగి రూ.5,25,627.06 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.21,892.61 కోట్లు ఎగిసి రూ.18,87,964.18 కోట్లకు చేరింది. HDFC మార్కెట్ క్యాప్ రూ.16,251.27 కోట్లు పెరిగి రూ.7,68,052.87 కోట్లకు పెరిగింది. HDFC మార్కెట్ క్యాప్ రూ.3,943.09 కోట్లు తగ్గి రూ.4,03,969.09 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.521.75 కోట్లు క్షీణించి రూ.4,06,245.26 కోట్లకు పెరిగింది.
ఇక, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.22,594.64 కోట్లు తగ్గి రూ.12,98,999.83 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.7,474.58 కోట్లు క్షీణించి రూ.6,59,587.97 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.3,480.6 కోట్లు క్షీణించి రూ.4,43,106.96 కోట్లకు, ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.2,600.14 కోట్లు తగ్గి రూ.5,16,762.48 కోట్లకు, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.172.04 కోట్లకు తగ్గి రూ.4,51,577.84 కోట్లకు క్షీణించింది.