భారత స్టాక్ మార్కెట్కు ప్రస్తుతం నిజంగా పండుగ సమయం. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) షేర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి. ఆసియాలోనే అత్యంత పురాతన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఒకటైన బీఎస్ఈ షేర్లు సోమవారం ఒక్కరోజే ఇంట్రాడే ట్రేడింగ్లో ఏకంగా 7.2% లాభపడింది. దలాల్ స్ట్రీట్లో కొనుగోళ్ల జోరు కొనసాగుతుండటంతో ఈ షేర్స్ ఏకంగా రూ.7,000 మార్కును దాటి సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.7,047ను టచ్ చేసింది.

భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చల్లబడటంతో భారత స్టాక్ మార్కెట్ మళ్లీ బుల్స్ నియంత్రణలోకి వచ్చింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి తొలగిపోవడంతో స్టాక్ మార్కెట్ ఇవాళ ఉత్సాహంగా ప్రారంభమైంది. బీఎస్ఈ షేరు అయితే ఏకంగా ట్రేడింగ్ మొదటి నుండి లాభాల బాటలో దూసుకుపోయింది.
ఈ భారీ ర్యాలీతో బీఎస్ఈ షేర్లు కేవలం మూడు నెలల వ్యవధిలోనే అద్భుతమైన పురోగతిని సాధించింది. మార్చి నెలలో రూ.3,682 వద్ద షేర్ ధర కనిష్ట స్థాయి నుండి ఏకంగా 91.4% పెరిగింది. ఈ రికవరీతో కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.1 లక్ష కోట్ల మైలురాయికి చేరుకుంది. నేటి గరిష్ట స్థాయి వద్ద బీఎస్ఈ మార్కెట్ క్యాప్ సుమారు రూ.95,345 కోట్లకు చేరింది. అంటే దీనికి కేవలం మూడు నెలల్లోనే రూ.45,528 కోట్ల మార్కెట్ వాల్యూ తోడైంది.
ఇటీవల విడుదలైన మార్చి త్రైమాసికపు (Q4FY25) బలమైన ఫలితాలు కూడా ఈ షేరుకు మరింత ఊతమిచ్చాయి. చాల వరకు బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్ కోసం టార్గెట్ ధరను పెంచడంతో కొనుగోళ్ల జోరు మరింత పెరిగింది. దీంతో బీఎస్ఈ షేరు స్వల్ప కాలంలోనే అత్యంత ముఖ్యమైన టర్నరౌండ్ స్టాక్లలో ఒకటిగా నిలిచింది.
మార్చి 2025 త్రైమాసికంలో బీఎస్ఈ ఈ అద్భుతమైన ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ నికర లాభం ఏకంగా 364% పెరిగి రూ.493 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోచూస్తే కేవలం రూ.106 కోట్లు మాత్రమే. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 75% పెరిగి రూ.847 కోట్లకు చేరింది. ట్రాన్సక్షన్ ఛార్జీలు, కార్పొరేట్ సర్వీసెస్ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 31 మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 70% పెరిగి రూ.1,326 కోట్లకు చేరుకుంది.
ఈ అద్భుతమైన Q4 ఫలితాల తర్వాత బ్రోకరేజ్ సంస్థలు బీఎస్ఈ షేరు టర్గెట్ ధరను ఏకంగా రూ.7,600 వరకు పెంచాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే 'buy' రేటింగ్ను కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.7,600గా నిర్ణయించింది. జెఫరీస్ కూడా 'Hold' రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.5,250 నుండి రూ.7,000కి పెంచింది. నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా ఈ షేరుపై 'buy' రేటింగ్తో పాటు రూ.7,200 టార్గెట్ ధరను సూచించింది. దీంతో బీఎస్ఈ షేరు పెట్టుబడిదారులకు నిజంగా కాసుల పంట పండిస్తోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications