Hyderabad News: పోయాం మోసం-హైదరాబాదీలు.. ఈ స్కామ్‌లో వేలకోట్లు ఫసక్, మీరూ ఇరుక్కున్నారా?

DB Stock Broking scam: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక రాబడుల మోజులో పడిపోతున్నారు. తక్కువ పెట్టుబడులపై ఎక్కువ రాబడులను అందిస్తామంటూ మాయగాళ్ల మాటలు నమ్మి వేల కోట్లు మునిగిపోతున్నారు. అయితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ స్మామ్ ప్రస్తుతం హైదరాబాదీలను సైతం ముంచేసింది.

అవును మనం మాట్లాడుకుంటున్నది డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ గురించే. రూ.7 వేల కోట్లకు సంబంధించిన ఈ బడా స్కామ్ అసోంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో హైదరాబాదుకు చెందిన కొందరు పెట్టుబడిదారులు సైతం నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తేలింది. పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న తర్వాత హైదరాబాద్‌కు చెందిన పలువురు పెట్టుబడిదారులు ఫిర్యాదు చేయడంతో.. రూ.7,000 కోట్ల మేరకు పెట్టుబడిదారులను మోసగించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సైబరాబాద్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.

Many Hyderabad invetors lost money in DB Stock Broking scam totaling to 7000 crores

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గౌహతికి చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్ యజమాని దీపాంకర్ బర్మన్, అతని అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కంపెనీకి హైదరాబాదుతో పాటు ముంబై, బెంగళూరు, గౌహతిలో కూడా కార్యాలయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీనిపై పుప్పల్‌గూడకు చెందిన బాధితుడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు గతనెల 23న ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. మంచి రిటర్న్ అందిస్తామని డీబీ స్టాక్ బ్రోకింగ్ నమ్మబలికిందని వాపోయాడు.

ఇదే క్రమంలో హైదరాబాదు చెందిన మరో బాధితుడు కంపెనీలో డిసెంబర్ 2022లో రూ.88.50 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకు కొంత వడ్డీ ఆదాయాన్ని పొందానని పేర్కొన్నాడు. నగరానికి చెందిన విశ్వజీత్ సింగ్ కంపెనీలో రూ.36.80 లక్షలు పెట్టానని, ఇప్పటి వరకు వడ్డీ రూపంలో రూ.16.2 లక్షలు తిరిగి పొందినట్లు పేర్కొన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాదులోనే అనేక మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. డీబీ స్టాక్ బ్రోకింగ్ మోసానికి దేశవ్యాప్తంగా దాదాపు 23 వేల మంది బలయ్యారు. పోలీసులు సైతం బాధితులు ముందుకు రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉండగా ఆరోపణలో ఎదుర్కొంటున్న బర్మాన్, ఆగస్టు 21న తన కార్యాలయానికి తాళం వేసి గౌహతి నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలో తలదాచుకున్నాడని తెలుస్తోంది. అక్కడ సైతం పెట్టుబడుల పేరుతో చాలా మందిని ఈ కంపెనీ ముంచిందని పోలీసులు చెబుతున్నారు.

పెట్టుబడుల పేరుతో అధిక రాబడులను ఆశజూపే ఇలాంటి కంపెనీలకు ప్రజలు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు అవగాహన క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ రాబడులను ఆశిస్తున్న అనేక మంది మోసగాళ్ల మాటలతో నష్టపోతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+