adani: హిండెన్బర్గ్ రీసెర్చి నివేదిక విడుదల అనంతరం అదానీ కంపెనీల్లో ఎంత గందరగోళం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు గ్రూపు కంపెనీలన్నీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. ఆ సంస్థల షేర్లు దాదాపు ప్రతిరోజూ లోయర్ సర్క్యూట్లను టచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో రెడ్ లో ఉన్న షేర్లు ఒక్కసారిగా గ్రీన్ లోకి మారి షాక్ ఇచ్చాయి. చాలా మందికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు.

ఒక్కసారిగా భారీ లాభాల్లోకి:
తీవ్ర ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీకి, మంగళవారం షేర్ల రీబౌండింగ్ కొంత ఊపిరి పోసినట్లయింది. 8 లిస్టెడ్ కంపెనీల షేర్స్ బాగా పుంజుకున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ అయితే ప్రారంభంలో 7 శాతానికి పడిపోయింది. అనంతరం వేగంగా తిరిగి గ్రీన్ లోకి వచ్చింది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 24 శాతం భారీ రీబౌండింగ్ ను నమోదు చేసింది. మధ్యాహ్నం 1.30 సమయంలో 12.64 శాతం పెరిగి రూ.1,344.40 వద్ద ట్రేడయింది. మార్కెట్ ముగిసే సమయానికి 15 శాతం వృద్ధితో రూ.1,3,71కి చేరింది.

ఇదీ రీబౌండింగ్ కారణం:
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ విల్మార్, ACC, అంబుజా సిమెంట్స్, NDTV వంటి గ్రూపులోని ఇతర లిస్టెడ్ కంపెనీల్లోనూ ఇదే వైఖరి కనిపించింది. కేవలం అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ మాత్రమే 5 శాతం లోయర్ సర్క్యూట్ వద్ద ఆగిపోయాయి. 2023 మార్చి చివరి నాటికి 690 మిలియన్లు-790 బిలియన్ల మేర షేర్-బ్యాక్డ్ లోన్లను ముందస్తుగా తిరిగి చెల్లించాలని గ్రూపు చూస్తున్నట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ నివేదించడమే ఈ భారీ రీబౌండింగ్ కు కారణంగా తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

అదానీ గ్రీన్ ఎనర్జీ ఎందుకు పెరిగిందంటే..
గ్రూపు క్రెడిట్ ప్రొఫైల్ను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో రుణాల చెల్లింపులకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. తద్వారా లిస్టెడ్ కంపెనీల్లో పేరుకుపోయిన అధిక రుణాలపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళనకు కొంతమేర ఉపశమనం కల్పించవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. 800 మిలియన్ డాలర్ల విలువైన 2024 వ్యవధి బాండ్లను మూడేళ్ల క్రెడిట్ లైన్ ద్వారా రీఫైనాన్స్ చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఈ నివేదిక తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్ ను తాకాయి.

బ్యాంకుల తీపికబురు:
అదానీ ఎంటర్ ప్రైజెస్ కోసం బ్యాంకులు క్రెడిట్ పరిమితులు రిటైన్ చేసినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించడమూ.. షేర్ల భారీ ర్యాలీకి మరో కారణమైంది. SBI నేతృత్వంలోని దేశీయ రుణదాతలు గ్రూపునకు మంజూరు చేసిన క్రెడిట్ పై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించినట్లు నివేదిక వెల్లడించింది. అయితే ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ సంస్థ షేర్ల ద్వారా రుణాలు సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు.. ఫిబ్రవరి 27న విడుదలైన వార్తలను అదానీ గ్రూపు ఖండించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications