కంపెనీలో ఓ విలువైన ఉద్యోగి పోతే ఆ కంపెనీ ఎంత నష్టపోతుందో తెలిపే కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .జీతం ఎక్కువ అడిగారని ఆ ఉద్యోగిని తీసేయడం ద్వారా కంపెనీ డబుల్ నష్టపోయిందని ఆ పోస్ట్ చెబుతోంది. ఒక విలువైన ఉద్యోగి తొలగించడం ద్వారా.. కార్పొరేట్ మేనేజర్లు ఎంత తక్కువ ప్రయత్నంతో తమ సంస్థ నిర్మాణాన్ని దెబ్బతీస్తారో తెలుస్తోంది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రెడ్డిట్ పోస్ట్లో.. ఒక మేనేజర్ తన అత్యుత్తమ ఇంజనీర్ ఉద్యోగం ఎందుకు వదిలేశాడో వివరించారు. ఆ ఇంజనీర్ Salary పెంపు కోసం రూ. 1.84 లక్షల ($2,000) అడిగినప్పటికీ.. కంపెనీ కేవలం 1.5 శాతం మాత్రమే పెంపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సవరణను అవమానంగా భావించిన ఉద్యోగి వెంటనే రాజీనామా పత్రం సమర్పించాడని మేనేజర్ వెల్లడించారు.

మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ జీతాలపై కఠినమైన పరిమితులు విధించడంతో తాము అర్హులైన ఉద్యోగులకు సరైన పెంపును అందించలేకపోయారు.కంపెనీ బాగా నడుస్తున్నప్పటికీ..ఉద్యోగులు ఎంత బాగా పనిచేసినా.. చర్చలకు అవకాశం లేకుండా ఒక్కో ఉద్యోగికి కేవలం 1.5 శాతం పెంపు మాత్రమే అనుమతించారు. దీని వల్ల కొంతమందికి అసంతృప్తి ఏర్పడటం సహజం. నేను మా డైరెక్టర్కు సూచించాను. కానీ బృందం కోసం నేను ఎక్కువ అడగలేకపోయానని మేనేజర్ రాశారు.
ఆ ఉద్యోగి వెంటనే ఉద్యోగాల కోసం వెతికాడు. మళ్లీ, దాదాపు 10 శాతం ఎక్కువ జీతం ఇచ్చే కొత్త ఉద్యోగాన్ని సంపాదించాడని మేనేజర్ పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టే ఆ ఇంజనీర్ మూడు శాతం పెంపు పొందినప్పటి వరకు ఉద్యోగంలో కొనసాగేవాడని స్పష్టం చేశారు. అతను అనేక ప్రాజెక్టులకు నాయకత్వం వహించి, బృందానికి కీలకమైన జ్ఞానాన్ని, ప్రత్యేకమైన పని తీరును నిర్మించాడు. ఇప్పుడు ఆ అనుభవం మొత్తం కంపెనీ నుంచి వెళ్లింది. మేనేజర్ అనవసరమైన 2 వేల డాలర్ల కోసం బృందంలో పెద్ద లోటు ఏర్పడిందని చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత.. యూజర్లు మేనేజర్ ప్రవర్తనను ప్రశంసించారు. ఒకరు మీరు బృంద సభ్యునికి మద్దతుగా నిలిచారు. అది గొప్ప విషయం అని అన్నారు. ఇంకొకరు ఇది అవమానకరమే.. అతను ఎందుకు వెళ్ళిపోయాడో సులభంగా అర్థమవుతుంది. ప్రతిభావంతులను నిలుపుకోవడానికి డబ్బు చెల్లించడం మీ కంపెనీకి సమస్య కాదేమో అని వ్యాఖ్యానించారు.
మూడవ వ్యక్తి మాట్లాడుతూ.. చిన్న విషయాల్లో పొదుపు చేసి, పెద్ద విషయాల్లో తెలివితక్కువగా వ్యవహరిస్తే, కంపెనీలు ప్రతిభావంతులను నిలుపుకోలేవు. అందుకే ఉద్యోగులు 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతున్నారని పేర్కొన్నారు. నాల్గవ వ్యక్తి మాట్లాడుతూ.. మేనేజర్ నివేదికలో మీరు అతనికి మద్దతు చూపించారని.. అతనితో పనిచేసి సంతోషంగా ఉన్నారని రాయాలి. తద్వారా కంపెనీకి వారి పొరపాటు తెలుస్తుందని సలహా ఇచ్చారు.
ఈ సంఘటన ద్వారా కంపెనీలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే.. ప్రతిభావంతులను వదిలించడంలో చిన్న డబ్బు మించకూడదు. సరైన జీతం, గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల, కంపెనీ పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటుంది. కేవలం 1.5 శాతం జీతం పెంపు కోసం ఒక మేనేజర్ అత్యుత్తమ ఇంజనీర్ ను కోల్పోయిన సంఘటన.. ప్రతిభావంతులను నిలుపుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని పలువురు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications