భార్యాభర్తల విడాకుల కేసులో కెనడా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భర్త ఉద్యోగాన్ని వదిలేసినప్పటికీ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యధిక జీతం పొందే ఉద్యోగాన్ని వదిలివేసినా.. కుటుంబ పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేడని సింగపూర్ కుటుంబ న్యాయస్థానం స్పష్టం చేసింది. కెనడాకు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తన భార్య, నలుగురు పిల్లలకు దాదాపు 6.34 లక్షల సింగపూర్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లకు పైగా) బకాయి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా ఆర్థిక బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి, అతని భార్య ఇద్దరూ కెనడియన్ పౌరులు. వారు 2013లో తమ నలుగురు పిల్లలతో కలిసి సింగపూర్కు వెళ్లారు. ఆ వ్యక్తి ఒక ప్రముఖ సంస్థలో సింగపూర్ కార్యాలయంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ.. 2023 నాటికి వార్షికంగా 8.6 లక్షల సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 కోట్లు)కు పైగా సంపాదిస్తున్నాడు. అతని భార్య డిపెండెంట్ పాస్పై గృహిణిగా ఉంటటోంది. పిల్లలు అంతర్జాతీయ పాఠశాలల్లో చదువుతున్నారు.

2023 ఆగస్టులో ఆ వ్యక్తి కుటుంబాన్ని విడిచిపెట్టి మరో మహిళతో కలిసి నివసించడం ప్రారంభించాడు. విడిపోయిన తర్వాత మొదటగా భార్యకు నెలకు 20,000 సింగపూర్ డాలర్లు (రూ. 15.5 లక్షలు) నిర్వహణ ఖర్చుగా చెల్లించేందుకు అంగీకరించాడు. అయితే కొద్ది కాలంలోనే ఈ మొత్తాన్ని 11,000 సింగపూర్ డాలర్లకు తగ్గించాడు. ఈ ఆర్థిక సహాయం సరిపోదని భావించిన భార్య.. అక్టోబర్ 2023లో సింగపూర్ మహిళా చార్టర్ చట్టం కింద కోర్టును ఆశ్రయించింది.
ఈ దరఖాస్తు దాఖలైన కొద్ది రోజులకే.. అక్టోబర్ 9, 2023న ఆ వ్యక్తి తన లాభదాయకమైన సింగపూర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. జూలై 2024 వరకు అదే జీతం, ప్రయోజనాలతో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, అతను స్వచ్ఛందంగానే ఉద్యోగం వదిలేశాడని కోర్టు గుర్తించింది. అనంతరం జనవరి 2024లో సింగపూర్ను వదిలి కెనడాకు వెళ్లిపోయాడు. కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే తరువాత జూమ్ ద్వారా విచారణకు హాజరైన అనంతరం ఆ వారెంట్ ఎత్తివేయబడింది.
కోర్టు విచారణలో.. ప్రస్తుత ఆదాయం మాత్రమే కాకుండా, వ్యక్తి సంపాదించగల సామర్థ్యం, ఆస్తులు, మొత్తం ఆర్థిక వనరులు కూడా భరణం నిర్ణయంలో కీలకమని న్యాయమూర్తి ఫాంగ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ.. అతని సంపాదన సామర్థ్యం సింగపూర్లో సంపాదించిన స్థాయినే ఆధారంగా తీసుకోవాలని కోర్టు తేల్చింది.
అక్టోబర్ 2024లో అతను కెనడాలో కొత్త ఉద్యోగం ప్రారంభించిన తర్వాత మాత్రమే అతని ఆదాయం తగ్గిందని కోర్టు అంగీకరించింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల పోషణకు సమానంగా బాధ్యత వహించాలని ఆదేశించింది. మొత్తం లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2025 వరకు నిర్వహణ ఖర్చు 7.88 లక్షల సింగపూర్ డాలర్లుగా నిర్ధారించబడింది. ఇందులో ఇప్పటికే చెల్లించిన మొత్తాన్ని తీసివేసి.. మిగిలిన 6.33 లక్షల సింగపూర్ డాలర్లు ఒకేసారి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుపై ఆ వ్యక్తి అప్పీల్ దాఖలు చేయగా.. అప్పీల్ ఫలితం వచ్చే వరకు ఒకేసారి చెల్లింపు అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ కేసు అధిక జీతం ఉన్న Job వదిలేయడం ద్వారా కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

Gold rates: వరుస లాభాలకు బ్రేక్.. ఈ రోజు బంగారం ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications