అత్యంత తక్కువ ధరకే మలేరియా వ్యాక్సిన్‌, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌..

మలేరియా వ్యాక్సిన్‌ ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలి పిల్లల మలేరియా వ్యాక్సిన్‌ ను కేవలం రూ. 430 కంటే తక్కువకే తీసుకురానున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌..బహుళ జాతి ఫార్మా కంపెనీ జీఎస్‌కే పీఎల్‌సీ రెండు కలిపి సంయుక్తంగా మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ తీసుకురానున్నాయి.

కాగా గతంలో ఈ వ్యాక్సిన్‌ ధర రూ.859కు అందుబాటులో ఉండేది.తాజాగా ఈ వ్యాక్సిన ను 2028 నాటికి 60శాతం తగ్గింపుతో అందిస్తామని కంపెనీ ప్రకటించింది.పిల్లలకు మలేరియా రాకుండా ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్లు వేస్తారు.ఈ ధర తగ్గింపు వ్యాక్సిన్ ద్వారా చాలా ఎక్కువ మందికి చేరుతుందని ప్రతి సంవత్సరం వేలాది మంది యువ ప్రాణాలను కాపాడుతుందని భావిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏటా ఐదులక్షల మందికిపైగా పిల్లలు మలేరియా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా, భారత్‌ వంటి దేశాలను ఈ మలేరియా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ముందు జాగ్రత్తగా మలేరియా టీకాను వేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. కరువుతో అల్లాడుతున్న ఆఫ్రికాలో నిరుపేద దేశాలైన పిల్లలకు తక్కువ ధరకే మలేరియా వ్యాక్సిన్లు అందించేందుకు గవి అనే స్వచ్ఛంద సంస్థ అక్కడ పనిచేస్తోంది. ఈ సంస్థకు వ్యాక్సిన్లు తక్కువ ధరకు సరఫరా చేయడం ద్వారా పిల్లలను మలేరియా బారీ నుండి కాపాడుకోవచ్చని జీఎస్‌కే ప్రతినిధులు చెబుతున్నారు.

Bharat Biotech malaria vaccine malaria vaccine price cut RTS S vaccine under 5 GSK Bharat Biotech malaria update malaria vaccine for Africa affordable malaria vaccine malaria vaccine 2025 Gavi vaccine funding endemic country health news malaria prevention India global health vaccine updates low-cost vaccines India

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. జీఎస్‌కే, పాత్‌ తదితర ఫార్మా కంపెనీలు కలిసి ఆర్‌టీఎస్‌-ఎస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఈ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించిందని.. ఈ వ్యాక్సిన్‌ టెక్నాలజీని జేఎస్‌కే.. భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేసిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు అలాగే గవికి సరఫరా చేసేందుకు 2021లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి కోసం భారత్‌ బయోటెక్‌ 200 మిలియన్ల పెట్టుబడి పెట్టిందని కృష్ణ తెలిపారు. మలేరియాకు గురయ్యే పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చేయడమే మా లక్ష్యమన్నారు.

ఇక జీఎస్‌కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ మాట్లాడుతూ.. 2021 నుంచి భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. మలేరియాను ఎదుర్కోవడానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ను మరింత చౌకగా, అందుబాటులో ఉండేలా భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేశాం. ఇది మలేరియా నివారణ దిశగా పెద్ద అడుగు అని అన్నారు.

ఇక RTS,S అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన తొలి మలేరియా వ్యాక్సిన్.2021లో WHO ఈ వ్యాక్సిన్‌ను వినియోగానికి సిఫారసు చేసింది. అప్పటి నుండి, GSK ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో, తయారీ సాంకేతికతను భారత్ బయోటెక్‌కి బదిలీ చేయడంలో ఎంతో సహకరించింది. ఈ వ్యాక్సిన్ ధర తగ్గింపుతో మలేరియా ప్రభావిత కుటుంబాలకు ఉపయోగమవుతుంది. దీని ద్వారా వ్యాధిని నియంత్రించి, భవిష్యత్తులో పూర్తిగా తొలగించే దిశగా ప్రపంచం ముందుకు సాగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+