మేకిన్ ఇండియాలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారత్లో టీవీ ఉత్పత్తులను(మాన్యుఫాక్చరింగ్) ప్రారంభించనున్నట్లు శాంసాంగ్ ఇండియా పేర్కొంది. అయితే అప్పటివరకు టీవీ సెట్స్ను దిగుమతి చేసుకునేందుకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాబోయేది దసరా,దీపావళి పండుగ సీజన్ కావడంతో... బిజినెస్ కంటిన్యుటీ దెబ్బతినకుండా ఉండాలంటే టీవీ సెట్స్ను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఐటీ&ఎలక్ట్రానిక్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు శాంసంగ్ ఇండియా ఓ లేఖ రాసింది.
దేశంలో టీవీ మాన్యుఫాక్చరింగ్ను ప్రారంభించాలంటే ఇప్పుడు తమ బిజినెస్ సజావుగా సాగాల్సిన అవసరం ఉందని శాంసాంగ్ తమ లేఖలో పేర్కొంది. దిగుమతులపై ఆంక్షలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు వ్యతిరేకమని పేర్కొంది. ఇదే విషయమై శాంసంగ్ ఇండియా ప్రధాని కార్యాలయానికి,డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్యాలాయానికి కూడా లేఖ రాసిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికైతే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ఈ ఏడాది జులైలో టీవీ సెట్ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను పెంచడం... చైనాపై దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో టీవీ సెట్లు దిగుమతి చేసుకోవాలనుకునే కంపెనీలు కేంద్రం నుంచి తప్పనిసరిగా లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీ సెట్ల దిగుమతికి అనుమతి కోరుతూ శాంసంగ్ ఇండియా కేంద్రానికి లేఖ రాసింది.
గతంలో చెన్నైలో శాంసంగ్కి టెలివిజన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఉండేది. అయితే దిగుమతి సుంకాల భారంతో టీవీల తయారీ ఖర్చు పెరిగిపోవడంతో శాంసంగ్ 2018లో చెన్నై ప్లాంట్ను మూసివేసింది. భవిష్యత్తులో ఆ ప్లాంట్ను తిరిగి తెరిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ భారత్లోనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పడితే దిగుమతుల కోసం మరో దేశంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications