మేక్ ఇన్ ఇండియా కొత్త రికార్డు.. చైనా ఆధిపత్యానికి చెక్..భారత్ నుంచి $50 బిలియన్ విలువైన ఐఫోన్లు ఎగుమతి..

ఆపిల్ తన ఉత్పత్తుల తయారీ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీకి భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. కుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం 2025 సంవత్సరంలో భారతదేశం నుంచి 50 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఐఫోన్‌లను భారత్ నుండి ఎగుమతి చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ధృవీకరించారు. ఇది భారతదేశంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక చారిత్రక మైలురాయిగా పరిగణించబడుతోంది.

సోషల్ మీడియా వేదిక Xలో అశ్విని వైష్ణవ్.. ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని ఫేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ ఎగుమతులు 50 బిలియన్ డాలర్లను దాటాయని ఆయన తెలిపారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.4.51 లక్షల కోట్లకు సమానం. ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' దృష్టికి ఇది ఒక గొప్ప విజయంగా నిలుస్తోంది. ఉత్పత్తిదారు ఆర్థిక వ్యవస్థగా మారాలనే మా లక్ష్యంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తోందని వైష్ణవ్ పేర్కొన్నారు.

Make in India Apple iPhone exports Apple manufacturing India iPhone production India India electronics exports Apple India supply chain iPhone export value India Apple Foxconn India India global manufacturing hub electronics manufacturing growth India iPhone shipment from India Apple India factory smartphone exports India India vs China manufacturing PLI scheme electronics Apple India investment India export economy electronics export boom iPhone assembly India Apple India Make in India

నివేదికల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఆపిల్ భారతదేశం నుంచి సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను రవాణా చేసింది. ప్రస్తుతం ఆపిల్ భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుల్లో ఒకటిగా మారింది. ఈ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడినట్లు అంచనా.

ఆపిల్ 2022లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ఫోన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ (PLI) పథకంలో చేరింది. ఈ పథకం భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా పెరగడానికి కీలకంగా మారింది. ఆపిల్‌తో పాటు శామ్‌సంగ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా భారతదేశాన్ని తయారీ కేంద్రంగా ఎంచుకున్నాయి. 2021 నుంచి 2025 మధ్య కాలంలో శామ్‌సంగ్ సుమారు 17 బిలియన్ డాలర్ల విలువైన పరికరాలను ఎగుమతి చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం భారతదేశంలో ఐదు ఐఫోన్ తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటిలో మూడు టాటా గ్రూప్ నిర్వహిస్తుండగా, రెండు ఫాక్స్‌కాన్ నిర్వహిస్తోంది. వీటికి అనుబంధంగా అనేక MSMEలు సహా దాదాపు 45 కంపెనీలతో కూడిన విస్తృత సరఫరా గొలుసు పనిచేస్తోంది. అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 11 సంవత్సరాల్లో భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరగడం విశేషం.

ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే టాప్ మూడు వస్తువులలో ఒకటిగా నిలిచాయి.ఈ రంగం కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కాకుండా, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, హియరబుల్ డివైస్‌లు మరియు 46 కాంపోనెంట్ తయారీ ప్రాజెక్టుల వరకు విస్తరించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+