ఆపిల్ తన ఉత్పత్తుల తయారీ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీకి భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. కుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం 2025 సంవత్సరంలో భారతదేశం నుంచి 50 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఐఫోన్లను భారత్ నుండి ఎగుమతి చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ధృవీకరించారు. ఇది భారతదేశంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక చారిత్రక మైలురాయిగా పరిగణించబడుతోంది.
సోషల్ మీడియా వేదిక Xలో అశ్విని వైష్ణవ్.. ఎకనామిక్ టైమ్స్ కథనాన్ని ఫేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ ఎగుమతులు 50 బిలియన్ డాలర్లను దాటాయని ఆయన తెలిపారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.4.51 లక్షల కోట్లకు సమానం. ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' దృష్టికి ఇది ఒక గొప్ప విజయంగా నిలుస్తోంది. ఉత్పత్తిదారు ఆర్థిక వ్యవస్థగా మారాలనే మా లక్ష్యంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తోందని వైష్ణవ్ పేర్కొన్నారు.

నివేదికల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఆపిల్ భారతదేశం నుంచి సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను రవాణా చేసింది. ప్రస్తుతం ఆపిల్ భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుల్లో ఒకటిగా మారింది. ఈ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడినట్లు అంచనా.
ఆపిల్ 2022లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ఫోన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ (PLI) పథకంలో చేరింది. ఈ పథకం భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా పెరగడానికి కీలకంగా మారింది. ఆపిల్తో పాటు శామ్సంగ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా భారతదేశాన్ని తయారీ కేంద్రంగా ఎంచుకున్నాయి. 2021 నుంచి 2025 మధ్య కాలంలో శామ్సంగ్ సుమారు 17 బిలియన్ డాలర్ల విలువైన పరికరాలను ఎగుమతి చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం భారతదేశంలో ఐదు ఐఫోన్ తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటిలో మూడు టాటా గ్రూప్ నిర్వహిస్తుండగా, రెండు ఫాక్స్కాన్ నిర్వహిస్తోంది. వీటికి అనుబంధంగా అనేక MSMEలు సహా దాదాపు 45 కంపెనీలతో కూడిన విస్తృత సరఫరా గొలుసు పనిచేస్తోంది. అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 11 సంవత్సరాల్లో భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరగడం విశేషం.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే టాప్ మూడు వస్తువులలో ఒకటిగా నిలిచాయి.ఈ రంగం కేవలం స్మార్ట్ఫోన్లకే పరిమితం కాకుండా, ల్యాప్టాప్లు, సర్వర్లు, హియరబుల్ డివైస్లు మరియు 46 కాంపోనెంట్ తయారీ ప్రాజెక్టుల వరకు విస్తరించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications