IT News: ఏం చదివాం అన్నది కాదు భయ్యా చివరికి ఐటీ ఉద్యోగం చేశామా లేదా అన్నదే నేటి యువత లక్ష్యం. ఒత్తిడి ఉన్నప్పటికీ.. లక్షల్లో జీతాలు, నగరాల్లో పాష్ జీవితం కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఐటీ ఉద్యోగం ఉంటే స్థిరమైన ఆదాయం వచ్చి జీవితం మెుత్తం మారిపోతుందని భావన.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతున్న వేళ భారత టెక్ కంపెనీలకు పెద్ద మెుత్తంలో డీల్స్ రావటం లేదు. చీప్ లేబర్ దొరుకుతుందని అమెరికా, యూరోపియన్ దేశాలు ఎక్కువగా భారత కంపెనీలకు ప్రాజెక్టులను అందిస్తుంటాయి. కానీ ప్రస్తుతం ఉద్యోగాలకు డిమాండ్ లేకపోవటంతో చాలా కంపెనీలు నియామకాలను పూర్తిగా నిలిపివేశాయి. పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థను ఇది ప్రభావితం చేస్తోంది.

ప్రస్తుతం ఉద్యోగాల కోసం లక్షల మంది ఫ్రెషర్ల ఎదురుచూపులు మరింత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని త్రైమాసికాల పాటు ఈ పరిస్థితులు కొనసాగుతాయని నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఇప్పటికే రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకు తగిన స్థాయిలో ప్రాజెక్టులు లేక కంపెనీలు సతమతమోతున్నాయి. దీనివెనుక ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. ప్రపంచ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల వంటివి ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే సెప్టెంబర్లో 43 శాతం, అక్టోబర్లో 14 శాతం తగ్గుదల నమోదైంది.
దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని మోదీకి నిరుద్యోగిత పెద్ద సమస్యగా మారనున్నట్లు పోల్ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది యువత ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెట్టుకొచ్చేందుకు డిమాండ్ ఉన్న అన్ని టెక్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. అయితే నూతన ఉద్యోగ అవకాశాలు లేకపోవటం చాలా మందిని నిరుత్సాహానికి గురిచేస్తోంది. కంపెనీలు సైతం తమ వద్ద ఉన్న ఉద్యోగులకు కొత్త సాంకేతికతలపై శిక్షణ ఇస్తూ ఉద్యోగుల టర్నోవర్ రేషియోను, రిక్రూట్మెంట్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications