IT News: గడచిన వారం టెక్ కంపెనీలకు అస్సలు కలిసిరాలేదనే చెప్పుకోవాలి. దేశంలోని అగ్ర ఐటీ సేవల కంపెనీలు స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అయితే దీనంతటికీ కారణం యాక్సెంచర్ చేసిన ప్రకటనగా తెలుస్తోంది.
దేశంలోని టాప్-5 టెక్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.19,000 కోట్లు ఆవిరైంది. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల కారణంగా FY23 వృద్ధి అంచనాలను యాక్సెంచర్ తగ్గించింది. నాలుగో త్రైమాసికంలో అది కేవలం 2-6 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. ఇటీవల ఆదాయాలు, మార్జిన్లతో పాటు డిమాండ్ తగ్గుదలపై జాగ్రత్తగా ఉండాలంటూ కాగ్నిజెంట్, EPAM, Coforge, HCL చేసిన కామెంట్లతో సమీప భవిష్యత్తుపై యాక్సెంచర్ ఆందోళన వ్యక్తం చేసింది.

అలాగే FY25లో డిమాండ్ పుంజుకుంటుదని ఆశించటం ఆలోచించటం రిస్క్ తో కూడుకున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్ల కాలం తర్వాత చిన్న డీల్స్, ద్రవ్యోల్బణం వల్ల వ్యయాలపై జాగ్రత్తలు వంటి కారణాలతో టెక్ కంపెనీ యాక్సెంచర్ ఆందోళన చెందుతోంది. ఇండియన్ ఐటీ కంపెనీలు సైతం ఇదే మందగమనాన్ని చూడవచ్చి తెలుస్తోంది. ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో బలహీనతలు ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఈ క్రమంలో బీఎస్ఈలో టీసీఎస్ స్టాక్ 0.92 శాతం క్షీణించి రూ.3,209 కనిష్ఠ స్థాయికి చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ 1.36 శాతం క్షీణించి రూ.1,265.15 వద్ద కనిష్ఠ స్థాయికి పడిపోయింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1.04 శాతం క్షీణించి రూ.1,151.15కి చేరుకుంది. ఇక విప్రో స్టాక్ 1 శాతం క్షీణించి రూ.378.10కి చేరుకోగా.. టెక్ మహీంద్రా షేర్లు 2.28 శాతం మేర క్షీణించి రూ.1,094.10కి చేరుకున్నాయి. ఈ ఐదు కంపెనీల మార్కెట్ క్యాప్ గురువారం ముగింపు నాటికి రూ.19,168.70 కోట్లు తగ్గి రూ.23,32,827 కోట్లకు చేరుకుంది.
ఇదే క్రమంలో ప్రఖ్యాత నొమురా ఇండియా భారతీయ IT సేవల కోసం ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ ఔట్లుక్పై ఆందోళన వ్యక్తం చేసింది. FY24లో కంపెనీల అంతటా ఆపరేటింగ్ పనితీరు గణనీయంగా మారుతుందంటూ టెక్ మహీంద్రా, కోఫోర్జ్ లపై సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. యాక్సెంచర్ ద్వారా ఆదాయ గైడెన్స్ను తగ్గించటం.. IT సేవలకు డిమాండ్ను తగ్గించడాన్ని సూచిస్తుందని నోమురా అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఐటీ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్కు ముగింపు పలికిన కంపెనీ

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications