For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహీంద్రా కార్ల ధరల పెంపు.. ప్రీమియం సెగ్మెంట్లలో ఆ కార్లు కూడా..

|

కరోనా వైరస్, స్ట్రెయిస్ వల్ల మార్కెట్లు ఇంకా కోలుకోలేదు. ఏదో అలా సాగుతున్నాయి. కానీ కార్ల ధరలకు మాత్రం రెక్కలొస్తున్నాయి. అదీ కూడా అన్నీ కాదు.. మాహీంద్ర, ప్రీమియం సెగ్మెంట్లలో మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ మేరకు ఆ కంపెనీలు ప్రకటించాయి. ఈ సమయంలో కూడా కార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయని తెలిపాయి.

 mahindra raises vehicle prices

వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలను 1.9 శాతం వరకు పెంచుతున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలు రూ.4,000 నుంచి రూ.40,000 వరకు పెరగవచ్చని పేర్కొంది.

ప్రీమియం కార్ల సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌.. కార్ల ధరలను 5 శాతం వరకు పెంచుతున్నామని వెల్లడించింది. పెంచిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. లో ఎండ్‌ మోడల్‌ అయిన సీ-క్లాస్‌ ధర రూ.2 లక్షల వరకు పెరగనుండగా టాప్‌ ఎండ్‌ మోడల్స్‌ అయిన ఏఎంజీ జీటీ 63ఎస్‌ డోర్‌ కూపే వంటి కార్ల ధరలు రూ.15 లక్షలకు పైగా పెరగనున్నాయి.

English summary

మహీంద్రా కార్ల ధరల పెంపు.. ప్రీమియం సెగ్మెంట్లలో ఆ కార్లు కూడా.. | mahindra raises vehicle prices

mahindra raises vehicle prices and mercedes also high the rates.
Story first published: Saturday, January 9, 2021, 23:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X