For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.63,000 వరకు పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల ధరలు

|

మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14, 2022 నుండి తమ వాహనాలపై 2.5 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలు మోడల్స్, వేరియంట్‌ను బట్టి రూ.10,000 నుండి రూ.63,000కు పెరగనున్నాయి. వాహనాల ధరలు పెంచుతున్నట్లు గురువారం ఎక్స్చేంజీకి తెలిపింది.

స్టీల్, అల్యూమినియం, పల్లాడియం తదితర ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన ముడి సరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఈ క్రమంలో ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.

Mahindra hikes prices by up to RS 63,000 on its vehicle range from today

ఇతర ఓఈఎంల విషయానికి వస్తే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ సీవీ సెగ్మెంట్, హీరో మోటో కార్ప్, సుజుకీ మోటార్ సైకిల్, ఆడి, బీఎండబ్ల్యు తదితర వాహనాల ధరలు పెరిగాయి. గత కొద్ది నెలలుగా కార్ మేకర్స్ రామెటీరియల్ ఖర్చు 75 శాతం నుండి 78 శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు.

English summary

రూ.63,000 వరకు పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల ధరలు | Mahindra hikes prices by up to RS 63,000 on its vehicle range from today

Mahindra & Mahindra on Thursday announced a price hike of 2.5% on its range of vehicles from today (April 14, 2022.).
Story first published: Thursday, April 14, 2022, 19:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X