Free shares: దీపావళికి ముందు స్టాక్ మార్కెట్లో బోనస్ షేర్ల కోలాహలం నడుస్తోంది. చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు ఉచితంగా షేర్లను అందిస్తున్నాయి.

బోర్డు ఆమోదం..
మహారాష్ట్ర సీమ్లెస్ కంపెనీ బోర్డ్ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. ఈ వివరాలను సోమవారం సెబీకి తెలియజేసింది. ఈ నిర్ణయం వివరాలు బయటకు రావటంతో మార్కెట్లో కంపెనీ షేర్లు 2 శాతం పడిపోయాయి. బీఎస్ఈలో స్టాక్ ఈరోజు రూ.860 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

బోనస్ షేర్లు..
కంపెనీ స్టాక్ మార్కెట్కు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇన్వెస్టర్లు కలిగి ఉన్న ఒక్కో షేరుకు గాను మరో షేరును ఉచితంగా అందించాలని నిర్ణయించింది. అయితే బోనస్ షేర్ల విషయంలో రికార్డ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. దీపావళి నాటికి కంపెనీ రికార్డ్ తేదీని ప్రకటించవచ్చని తెలుస్తోంది. అయితే స్టాక్ స్పిట్ గురించి సైతం బోర్డు చర్చకు వచ్చినప్పటికీ దానిని ఆమోదించలేదు.

మల్టీబ్యాగర్ రిటర్న్స్..
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో కంపెనీ పనితీరు బాగానే ఉంది. 2022లో మల్టీబ్యాగర్ మహారాష్ట్ర సీమ్లెస్ షేర్ ధర రూ.518.70 నుంచి రూ.860 స్థాయికి పెరిగింది. ఈ క్రమంలో షేర్ దాదాపు 62 శాతం మేర పెరిగింది. అలాగే గడచిన 6 నెలల కాలంలో 45 శాతం వృద్ధి చెందింది. ఎన్ఎస్ఈలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.910గా ఉంది.

కంపెనీ వ్యాపారం..
మహారాష్ట్ర సీమ్లెస్ స్టీల్ పైపులు, ట్యూబులను తయారు చేసే కంపెనీ. ఇది డి.పి. జిందాల్ గ్రూప్ కంపెనీ. కంపెనీ పెట్రోకెమికల్ కంపెనీలకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ సంస్థ 1988లో స్థాపించబడింది. ముంబై సమీపంలో 100 ఎకరాల్లో కంపెనీ తయారు ప్లాంట్ కలిగి ఉంది. కంపెనీ అవసరాల కోసం భారీ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ కలిగి ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications