Dividend Stock: ఇంతకు ముందు కరోనాతో అనేక వ్యాపారాలు కుదేలైనప్పటికీ.. ప్రస్తుతం మంచి రాబడులను ప్రకటిస్తున్నాయి. దీంతో తమ పెట్టుబడిదారులకు సైతం తాము సంపాదించిన లాభాలను చాలా కంపెనీలు పంచుతూ వారిని ధనవంతులుగా మార్చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర స్కూటర్స్ కంపెనీ ఇన్వెస్టర్లకు అతిపెద్ద శుభవార్తను ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ షేర్లపై పందెం కాసిన ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. కంపెనీ ఒక్కో షేరుపై రూ.110 డివిడెండ్ రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. రానున్న వారం స్టాక్ మార్కెట్లో కంపెనీ ఎక్స్-డివిడెండ్ స్టాక్గా ట్రేడ్ అవుతుంది. అందుకే చాలా మంది ఇన్వెస్టర్ల కళ్లు ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లపై పడ్డాయి.

మహారాష్ట్ర స్కూటర్స్ రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరుపై 1100 శాతం డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. అంటే అర్హులైన షేర్ హోల్డర్లకు ఒక్కో స్టాక్ పై రూ.110 డివిడెండ్ అందనుంది. దీనికోసం కంపెనీ సెప్టెంబర్ 15, 2023ను రికార్డు తేదీగా ప్రకటించింది. అంటే ఈ తేదీ నాటికి కంపెనీ రికార్డ్ బుక్లో పేరు ఉన్న ఏ పెట్టుబడిదారుడైనా ఒక్కో షేరుపై రూ.110 లాభాన్ని పొందుతారు.
శుక్రవారం కంపెనీ షేర్లు రూ.7,567 ధర వద్ద తమ మార్కెట్ ప్రయాణాన్ని ముగించాయి. గత నెలలో కంపెనీ షేర్ ధర దాదాపు 21 శాతానికి పైగా పెరిగాయి. అదే 6 నెలల క్రితం ఈ కంపెనీలో షేర్లను కొనుగోలు చేసిన ఎవరైనా పెట్టుబడిదారులు ఇప్పటి వరకు తమ హోల్డింగ్లో 82 శాతం లాభం పొందారు. ప్రస్తుతం కంపెనీ తన 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.7,799కి సమీపంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications