కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 తగ్గించి, వాహన వినియోగదారులకు మోడీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ధర తగ్గింపుపై నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. దీంతో పెట్రోల్ ధర రూ.9.50, డీజిల్ ధర రూ.7 తగ్గింది. రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి, ధరలు తగ్గించాలని పరిశ్రమ నుండి మొదలు సామాన్యుల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాలు తగ్గింపు బాట పట్టాయి.
పెట్రోల్, డీజిల్ పైన కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయాన్ని భారత కార్పోరేట్ వర్గాలు, ట్రేడర్లు, ఎగుమతిదారులు స్వాగతించారు. రాష్ట్రాలు కూడా సుంకాలను తగ్గించి కస్టమర్లకు మరింత ఉపశమనం అందించాలని కోరారు. ఇంధన ధరలు తగ్గితే సరుకు రవాణా వ్యయాలు తగ్గి ద్రవ్యోల్భణం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం కోత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందని, తద్వారా సామాన్యుడిపై భారం తగ్గుతుందని, ప్రభుత్వం ఆలోచన మంచిదని తెలిపారు. దీనికి తోడు పలు రంగాల కంపెనీలకు ముడి వ్యయాలు తగ్గుతాయని చెబుతున్నారు.

కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ఇది రెండోసారి. దీంతో కొన్ని రాష్ట్రాలు కూడా తగ్గిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ వ్యాట్ను తగ్గించాయి. లీటర్ పెట్రోల్ పైన రూ.2.08, డీజిల్ పైన రూ.1.44 తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. పెట్రోల్ పైన రూ.2.48, డీజిల్ పైన రూ.1.16 తగ్గిస్తున్నట్లు రాజస్థాన్, పెట్రోల్ పైన రూ.2.41, డీజిల్ పైన రూ.1.36 తగ్గిస్తున్నట్లు కేరళ ప్రకటించింది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications