Biggest malls: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పలు రాజకీయ ఆరోపణలకు కారణమైన లులూ మాల్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి పొలిటికల్ రంగుతో కాదు. ఇప్పటికే హైదరాబాద్లో అతిపెద్ద మాల్ ద్వారా భాగ్యనగరవాసులకు సేవలందిస్తున్న సదరు సంస్థ.. దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. ఇండియాలో అతిపెద్ద మాల్ను ప్రారంభించింది.
కేరళకు చెందిన వ్యాపారవేత్త మరియు ఎమిరాటీ బేస్డ్ బహుళజాతి సమ్మేళనం లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ MA యూసఫ్ అలీ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్లో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలోని UAE-ఇండియా బిజినెస్ ఫోరమ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు.

'అబుదాబి యువరాజు చారిత్రాత్మక పర్యటన భారతదేశం మరియు UAE వ్యాపారవేత్తలు తమ బిజినెస్లు మెరుగుపరచుకోవడానికి మరియు సహకరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. క్రౌన్ ప్రిన్స్ మరియు PM నరేంద్ర మోదీ సోదర భావంతో మెలుగుతున్నారు. మేము భారత్లో ఇప్పటికే గణనీయమైన పెట్టుబడులు పెట్టాము. ప్రస్తుత వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. త్వరలోనే అహ్మదాబాద్లో ఇంయాలో అతిపెద్ద షాపింగ్ మాల్ను ప్రారంభిస్తాము' అని స్పష్టం చేశారు.
4 వేల కోట్లతో భారత్లో అతిపెద్ద లులూ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది అలీ వెల్లడించారు. హైదరాబాద్లో 300 కోట్లతో నిర్మించిన మాల్ వల్ల దాదాపు 2 వేల మంది ఉపాది పొందుతున్నారు. కాగా ఇప్పుడు అహ్మదాబాద్ మాల్ ద్వారా కనీసం 4 వేల మంది యువతకు జాబ్స్ వస్తాయని అంచనా. వీటితో పాటు రానున్న రోజుల్లో కాశ్మీర్ మరియు నోయిడాలో ఫుడ్ ప్రాసెసింగ్తో సహా ఇతర రంగాలలోకి సైతం విస్తరించాలని లులూ గ్రూప్ చూస్తోందని యూసఫ్ అలీ తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications