నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉన్న ఈ రోజుల్లో, ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు ఆయిల్ కంపెనీలు. ఆగస్టు 1, 2025 నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.33.50 తగ్గించడమే ఇందుకు కారణం. ఈ ధర తగ్గింపుతో రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు వంటి వినియోగదారులకు నెలవారీ ఖర్చులో కొంత ఊరట లభించనుంది. అయితే వంటింటి సిలిండర్ ధర మాత్రం యథాతథంగా ఉంది.

ఆగస్టు 1, 2025 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ 33.50 తగ్గించాయి. తాజా తగ్గింపుతో, దేశ రాజధాని ఢిల్లీలో ఈ సిలిండర్ కొత్త ధర రూ 1,631.50గా ఉంది. 14.2 కిలోల గృహ అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇది గతంలో ఉన్న రేట్లకే కొనసాగుతోంది.
తాజా ధర తగ్గింపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ 1,631.50గా ఉంది. ముంబైలో ఇది రూ 1,582.50కి చేరగా, కోల్కతాలో రూ 1,734.50, చెన్నైలో రూ 1,789గా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో గత నెల ధర రూ 1,886.50గా ఉండగా, ఇప్పుడు రూ 34.50 తగ్గి రూ 1,852కు పడిపోయింది. ఈ తగ్గింపు వాణిజ్య రంగానికి గణనీయమైన ఊరటను అందిస్తుంది, ముఖ్యంగా హోటళ్లకు, టీ స్టాళ్లకు, రెస్టారెంట్లకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది. అయితే గృహ వినియోగ సిలిండర్ అయిన 14.2 కిలోల ఎల్పీజీ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం ఈ డొమెస్టిక్ సిలిండర్ ధర సుమారుగా రూ 905 వద్ద ఉంది. ఇతర నగరాల్లోనూ గృహ వినియోగ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.
తాజా తగ్గింపుతో సహా, గత కొన్ని నెలలుగా వరుసగా వాణిజ్య సిలిండర్ ధరలు తక్కువవుతున్నాయి. ఈ నిర్ణయం ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు వంటి రోజూ గ్యాస్ వినియోగించే వాణిజ్య రంగానికి మంచి ఊరటనిస్తోంది. అయితే, వంటింటి అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ తగ్గింపు వెనుక ఉన్న కారణాలు, వివిధ నగరాల్లో ధరల మార్పు వివరాలు, అలాగే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం వంటి అంశాలను తెలుసుకుందాం.
భారతదేశంలో మొత్తం ఎల్పీజీ వినియోగంలో 90 శాతం వంటింటి అవసరాల కోసం ఉంటుంది. మిగతా 10 శాతం మాత్రమే కమర్షియల్, ఇండస్ట్రీ, ఆటోమొబైల్ రంగాల్లో వినియోగిస్తారు.
ఈ కారణంగా, వంటింటి సిలిండర్ల ధరలు ఎక్కువగా స్థిరంగా ఉంటాయి. కానీ కమర్షియల్ సిలిండర్ల ధరలు తరచూ మారుతూ ఉంటాయి.
భారత ప్రభుత్వం ప్రకారం, నేచురల్ గ్యాస్ ధరలను ప్రపంచ క్రూడ్ ఆయిల్ ధరలకి సంబంధించి (10%) నిర్ణయిస్తారు. మే 2025 నాటికి ఇండియా కొనుగోలు చేసే క్రూడ్ ఆయిల్ ధర సగటు $64.5 పర్ బ్యారెల్కి పడిపోయింది. ఇది గత 3 సంవత్సరాల్లో కనిష్ఠ స్థాయి. దీనివల్ల ఆయిల్ కంపెనీలపై ఉన్న ఆర్థిక ఒత్తిడి కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. పరిశోధకుల అంచనా ప్రకారం, క్రూడ్ ధరలు $65 వద్ద కొనసాగితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలకు ఎల్పీజీ సంబంధిత నష్టాలు 45 శాతం వరకు తగ్గే అవకాశముంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications