బెంగళూరు నగరంలో ఆటో ఎల్పీజీ (LPG) సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. నగరంలోని మొత్తం గ్యాస్ స్టేషన్లలో దాదాపు సగం మూతపడటంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ కొరత శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) నాటికి మరింత ముదిరింది. నగరంలోని గ్యాస్ పంపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన ఆటో రిక్షాలు ఇప్పుడు సర్వసాధారణ దృశ్యంగా మారాయి.
బెంగళూరులోని ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. 'టోటల్ గ్యాస్' (Total Gas) తన అన్ని అవుట్లెట్లను పూర్తిగా మూసివేసింది. ఇక 'సూర్య గ్యాస్', 'సూపర్ గ్యాస్' వంటి స్టేషన్లలో స్టాక్ మధ్యాహ్నం లోపే అయిపోతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (HP), భారత్ పెట్రోలియం (BP) కేంద్రాల వద్ద కూడా గ్యాస్ కోసం ఆటోలు 3 కిలోమీటర్ల మేర క్యూలో నిలబడుతున్నాయి. అయినప్పటికీ, గంటల తరబడి వేచి చూసిన డ్రైవర్లకు నిరాశే ఎదురవుతోంది. స్టాక్ లేదంటూ సిబ్బంది వారిని వెనక్కి పంపుతున్నారు.

ఒక ప్రైవేట్ గ్యాస్ స్టేషన్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులుగా వారికి అసలు స్టాక్ అందలేదు. సాధారణంగా రోజుకు నాలుగు టన్నుల గ్యాస్ వచ్చే చోట, గత వారం అది రెండు టన్నులకు పడిపోయి, ఇప్పుడు సున్నాకు చేరింది. గ్యాస్ ధరలు కూడా గతంలో లీటరుకు రూ. 58 ఉండగా.. ఇప్పుడు అవి విపరీతంగా పెరగడం పెట్టుబడిదారులపై అదనపు భారాన్ని మోపుతోంది.
ఈ సంక్షోభం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. గ్యాస్ దొరుకుతుందనే ఆశతో తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నామని, కానీ మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు. కృష్ణస్వామి అనే డ్రైవర్ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం నింపుకున్న గ్యాస్తోనే నడుపుతున్నానని, ఇప్పుడు అది అయిపోవచ్చినందున ప్రయాణికులను తీసుకెళ్లడానికి భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో డ్రైవర్ శరవణ మాట్లాడుతూ.. గంటల తరబడి వేచి ఉంటే కేవలం 5 లీటర్లు మాత్రమే ఇస్తున్నారని, అది కేవలం 40-50 కిలోమీటర్లకే వస్తుందని చెప్పారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా గొలుసు దెబ్బతినడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కొరత వల్ల బెంగళూరు రోడ్లపై ఆటోల సంఖ్య తగ్గిపోయింది, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ప్రయాణికులు ఎలక్ట్రిక్ ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, Bengaluru లో అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్న డ్రైవర్లు ఈఎంఐలు (EMIs), ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు..లబోదిబోమంటున్న వ్యాపారులు..ఎంత పెరిగిందంటే..

Gas booking: సిలిండర్ కష్టాలకు చెక్! పైప్ గ్యాస్ కనెక్షన్ కోసం ఇలా అప్లై చేయండి!

Gas booking: గ్యాస్ అయిపోయిందా? టెన్షన్ వద్దు.. కేవలం 5 నిమిషాల్లో 5 కేజీల సిలిండర్ మీ సొంతం!

LPG గ్యాస్ సంక్షోభం.. PNG గ్యాస్ కనెక్షన్ ఎలా పొందాలి.. ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications
