కంపెనీల పరపతి రేటింగ్ కోసం, రేటింగ్ సంస్థలు అనుసరించే పద్ధతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దక్షిణ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి (ఎస్ఐసీసీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు.
ఒక కంపెనీ రుణ పత్రాలు, ఆస్తుల పరపతి రేటింగ్ను రేటింగ్ సంస్థలు ఎలా నిర్ణయిస్తాయి? ఆ విధానాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే అంశంపై తాను ఇప్పటికే కొన్ని రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమై చర్చించినట్టు ఆమె తెలిపారు.
రేటింగ్ ఏజెన్సీల నుంచి అత్యంత భద్రతను సూచించే ట్రిపుల్ ఏ రేటింగ్ పొందిన కొన్ని కంపెనీలూ, ఇటీవల కుప్పకూలిన విషయాన్ని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. ఈ సంఘటనలతోనే బ్యాంకుల ఆస్తుల నాణ్యత, కంపెనీల రుణ పత్రాలు, ఆస్తుల పరపతి రేటింగ్స్పై మదింపు జరుగుతోందన్నారు.

అలాగే ఆర్థిక అవకతవకలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లకు మరిన్ని అధికారాలు ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సీతారామన్ వెల్లడించారు. కష్టాల్లో ఉన్న రంగాల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
కొత్త ప్రమోటర్లకు రక్షణ కోసం...
మరోవైపు కొత్త ప్రమోటర్లకు రక్షణ కల్పించడం కోసం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)-2016లో కీలక సవరణలు చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు సిద్ధమైంది. దీనికోసం పార్లమెంట్ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలు చెప్పాయి.
ఏవైనా కంపెనీలు దివాలా తీసినప్పుడు వాటికి సంబంధించిన ఆస్తులను దివాలా ప్రక్రియ కింద ఇతర ప్రమోటర్లు కొన్నప్పుడు.. పాత కేసుల నుంచి కొత్త ప్రమోటర్లకు రక్షణ కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే, ఇటీవల దివాలా ప్రక్రియలో భాగంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ.. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) ఆస్తులను కొనుగోలు చేసింది.
అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇటీవల భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్కు చెందిన రూ.4 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. పాత ప్రమోటర్లపై అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు ప్రకటించారు.
ఇలా గనుక జరిగితే భవిష్యత్తులో దివాలా తీసిన సంస్థల ఆస్తులు కొనుగోలుకు ఇతర ప్రమోటర్లు ఎవరూ ముందుకురారని, పాత ప్రమోటర్లపై ఉన్న పాత కేసులు, కొత్త ప్రమోటర్లకు వర్తించకుండా ఉండేలా ఐబీసీ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications