Delhivery Earnings: దేశంలో కొన్నాళ్లుగా స్టార్టప్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకపక్క కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలను నిలుపుకోవటానికి అవసరమైన నిధులు లేక ఆందోళన చెందుతుంటే మరికొన్ని మాత్రం లాభాల్లోకి ప్రవేశిస్తూ పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతునున్నది లాజిస్టిక్స్ వ్యాపారంలో స్టార్టప్ కంపెనీగా ఉన్న దిల్లీవెరీ నిలిచింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను కంపెనీ ఇటీవల ప్రకటించగా తొలిసారిగా రూ.11.7 కోట్ల నికర లాభాన్ని సాధించినట్లు కంపెనీ నివేదించింది. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నికర ఆదాయం రూ.2,194 కోట్లకు చేరుకుంది. ఇది గత త్రైమాసికంలో నమోదైన ఆదాయం రూ.1,941 కోట్ల కంటే 13 శాతం అధికం. అలాగే ఏడాది కిందట ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.1,823 కోట్లుగా నిలిచింది.

యునికార్న్ లాజిస్టిక్స్ సంస్థ FY24 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దాని నికర నష్టాన్ని రూ.103 కోట్లగా నివేదించిన సంగతి తెలిసిందే. అలాగే Q3 FY23లో దాని నికర ఏకీకృత నష్టం రూ.195.6 కోట్లుగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ EBITDA రూ.183 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. కంపెనీ పీక్ డిమాండ్ ఉన్న సమయంలో కూడా నెట్వర్క్ నాణ్యత పటిష్టంగా కొనసాగించగలిగిందని కంపెనీ MD & సీఈవో సాహిల్ బారువా అన్నారు. కంపెనీ నిరంతరం మార్కెట్ డైనమిక్స్కు అనుగుణంగా మెరుగైన పనితీరును కనబరుస్తూ లాభదాయకతను సాధించింది.
అయితే శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే.. ఎన్ఎస్ఈలో స్వల్పంగా నష్టాలతో స్టాక్ ధర రూ.465 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలో ఇంట్రాడేలో స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.477.80ను చేరుకుంది. అయితే సోమవారం షేర్లలో లాభదాయకతపై సానుకూల ట్రేడింగ్ కొనసాగించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications