MPC Meeting: ప్రారంభమైన రిజర్వు బ్యాంక్ ద్రవ్యపరపతి సమావేశం.. ఆ నిర్ణయం ఎఫెక్ట్..

MPC Meeting: రిజర్వు బ్యాంక్ ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్యపరపతి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలో జూన్ 6 నుంచి మూడు రోజుల పాటు సమావేశం జరుగుతోంది. అయితే రేట్లపై కీలక ప్రకటన మాత్రం ఆఖరి రోజున ఉంటుంది.

నిపుణుల అంచనా ప్రకారం రేట్లపై రిజర్వు బ్యాంక్ ఈ సారి యథాతథ స్థితిని కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయం ద్వారా ఆర్బీఐ ద్రవ్యోల్బణంపై ప్రధానంగా దృష్టి కొనసాగుతున్నట్లు చెప్పుకోవచ్చు. రేట్ల తగ్గింపుకు మరింత కాలం ప్రజలు వేచి ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Loan payers may feel relaxed if rates hike paused by RBI in its June MPC meeting

ఒకవేళ రిజర్వు బ్యాంక్ తన ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకుండా ఇప్పుడు ఉన్న స్థితిని కొనసాగిస్తే హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పెరిగిన ఈఎంఐల భారంతో సతమతమౌతున్న అనేక మంది రుణగ్రహీతలకు ఇది ఖచ్చితంగా పెద్ద ఉపసమనాన్ని అందించే అంశంగా చెప్పుకోవచ్చు.

దేశ జీడీపీ గణాంకాలు, జీఎస్టీ వసూళ్లు, తయారీ రంగం పుంజుకోవటం, ద్రవ్యోల్బణం తరుగుదల వంటి కీలక అంశాలను రిజర్వు బ్యాంక్ సభ్యులు నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటారనే దానిపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇన్వెస్టర్లు సైతం రిజర్వు బ్యాంక్ రేట్ల ప్రకటన కోసం వేచి ఉన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+