Manipur crisis: పరిస్థితులు అదుపు తప్పిన మణిపూర్లో రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. నెల రోజుల కిందట రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస అనేక కష్టాలను తెచ్చిపెడుతోంది.
ప్రస్తుతం ఈ రాష్ట్రంలో నిత్యావసరాల కొరత ధరలను ఆకాశానికి ఎత్తేసింది. దీనికి తోడు ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన మందుల కొరత అక్కడ ఏర్పడింది. అలాగే బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు సతమతమౌతున్నారు. జాతీయ రహదారిని పౌర సంస్థలు అడ్డుకోవడం, ట్రక్కులు ఇంఫాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలాంటి తరుణంలో పెట్రోల్ బంకుల్లో ఇంధనం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు బ్లాక్ మార్కెట్లో లీటరు పెట్రోల్ రూ.200 పెట్టి కొనుక్కుంటున్నారు. తెరచి ఉన్న బంకుల ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక బియ్యం, ఉల్లి, బంగాళ దుంపలు వంటి నిత్యావసరాల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. అలాగే కోడి గుడ్డు ధర ఒక్కొక్కటి రూ.10కి చేరుకుంది. ప్రాణాలను రక్షించే మందులు, ఓవర్ ది కౌంటర్ ఔషధాల కొరత తీవ్రతరం కావటంతో అనేక మంది ముందుగా కొనుక్కుని నిల్వ చేసుకుంటున్నారు.
ప్రజల ఆశ్రయం కోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఆహారం, వైద్య సహాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కర్ఫ్యూ ఉండటంతో పరిస్థితులు మరింతగా జఠిలంగా మారాయి. ఇదే క్రమంలో హింసాత్మక చర్యలు కొనసాగటంతో బ్యాంకులు మూతపడగా.. ఏటీఎంలలో నగదు ఖాళీ అయ్యింది.
షెడ్యూల్డ్ తెగ(SC) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా గత నెలలో 'గిరిజన సంఘీభావ యాత్ర' తర్వాత.. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగటంతో అక్కడి పరిస్థితులు చేజారాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications