PSU Stock: దేశంలో డిఫెన్స్ స్టాక్స్ భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ ప్రవాహాలు సైతం డిఫెన్స్ రంగంలోని కంపెనీలకు వెళుతున్నాయి. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల షేర్లపై మార్కెట్లోని ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది.
ఈ రోజుల్లో రక్షణ రంగ కంపెనీల షేర్లపై మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఒకటైన LIC.. గత రెండు త్రైమాసికాలుగా రక్షణ రంగ స్టాక్లలో తన వాటాలను క్రమంగా పెంచుకుంటోంది. చర్య ఈ రంగంలో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా ఈ డిఫెన్స్ స్టాక్లో తమ వాటాను పెంచుకోవడం వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం మరింత పెరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ షేర్ల గురించే.

శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి భారత్ డైనమిక్స్ స్టాక్ ధర బీఎస్ఈలో ఒక్కోటి రూ.1419.60 రేటు వద్ద ముగిశాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.51,791 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు గడచిన ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 135 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు 74.93 శాతం వాటాను కలిగి ఉండగా, పబ్లిక్ ఇన్వెస్టర్లు 12.49 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 3.06 శాతం, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 9.52 శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ కంపెనీలో 1.83% వాటాతో 67,06,120 షేర్లను కలిగి ఉంది.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గైడెడ్ మిసైల్స్, అనుబంధ రక్షణ పరికరాల తయారీలో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద భారత ప్రభుత్వ సంస్థగా 1970లో హైదరాబాద్లో స్థాపించబడింది. కంపెనీ 2000లో భారత ప్రభుత్వంచే మినీ-రత్న విభాగంలో నామినేట్ చేయబడింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.854 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. FY24లో నిర్వహణ లాభం రూ.613 కోట్లుగా నమోదైదంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications