2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఎల్ఐసీ నుండి నో డివిడెండ్

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గత మార్చితో ముగిసిన చివరి ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రభుత్వానికి ఎలాంటి డివిడెండ్ అందించలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభలో తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇన్సురెన్స్ కంపెనీల డివిడెండ్ చెల్లింపులపై ఆంక్షలు విధించడం ఇందుకు కారణమని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ తన లాభాల నుండి ప్రభుత్వానికి రూ.2,610 కోట్లను డివిడెండ్‌గా చెల్లించింది. కానీ 2020-21లో రిజర్వ్ నిధులతో ఎల్ఐసీ తన పెయిడప్ ఈక్విటీ మూలధనాన్ని రూ.6,325 కోట్లకు పెంచుతుందన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎల్ఐసీ ఐపీవోకు రానుంది. రెండేళ్ల క్రితం డివిడెండ్ చెల్లించినప్పటికీ, 2020 మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లాభాల నుండి డివిడెండ్ చెల్లింపులకు దూరంగా ఉండాలని ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలను ఆదేశించినట్లుగా భగవత్ కరాడ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో కంపెనీలు ఆకస్మిక పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా మూలధనాన్ని ఉంచుకోవాలని ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలకు సూచించింది.

LIC did not pay dividend to government in FY21

ఈ నెలల్లోనే ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను సెబీ వద్ద దాఖలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2022 జనవరి 1 నుండి రూ.10,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్లు, పొదుపు, ఇతర ఖాతాల నుండి రూ.25,000 నగదు ఉపసంహరణకు సంబంధించిన ఛార్జీల్లో ఎలాంటి సవరణలు చేయలేదని ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు తెలిపాయని వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+