Lenskart News: దేశంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్టప్ కల్చర్ కారణంగా కంపెనీల వ్యవస్థాపకులు ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ నగరాల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు.
దేశంలో కళ్లజోళ్ల వ్యాపారంలో మంచి గుర్తింపు పొందిన బ్రాండ్గా లెన్స్ కార్ట్ నిలిచింది. పెద్దగా స్థంస్థాగత కంపెనీలు లేకపోవటంతో ప్రజల నుంచి మంచి ఆదరణను పొందింది. దీనిని స్థాపించిన వారిలో పీయూష్ బన్సాల్ కూడా ఒకరు. షార్క్ ట్యాంక్ ఇండియా న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా రూ.18 కోట్లు వెచ్చించి దిల్లీ నీతి బాగ్లో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ వెల్లడించింది.

మే 19, 2023న ఈ లగ్జరీ ప్రాపర్టీ డీల్ జరిగినట్లు డేటా వెల్లడించింది. 5056 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాపర్టీ ఉంది. దీని కొనుగోలు కోసం బన్సాల్ రూ.1.08 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. పత్రాల ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ మరియు బేస్మెంట్ను కవర్ చేసే బంగ్లాను సురీందర్ సింగ్ అత్వాల్ నుంచి బన్సల్ కొనుగోలు చేశారు. గౌతం అదానీ నుంచి పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వరకు అనేక మంది వ్యాపారవేత్తలు సొంత ఇల్లు కొనుక్కుని దిల్లీలో స్థిరపడ్డారు.
దీనికి ముందు మార్చిలో కొన్ని ఖరీదైన ఆస్తి లావాదేవీలు జరిగాయి. వీటిలో ముందుగా ప్రతిష్టాత్మక గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో 2,160 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధా రోహత్గీ పేరిట రూ.160 కోట్లకు కొనుగోలు చేయటం జరిగింది. అలాగే ఆగస్టులో గ్లోబల్ డెంట్ ఎయిడ్స్ డైరెక్టర్ రేణు ఖుల్లార్ దిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ ఏరియాలో 873 చదరపు గజాల బంగ్లాను రూ.61.70 కోట్లకు కొనుగోలు చేశారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు, సంపన్నులకు నివాసంగా ఉన్న దిల్లీ ప్రస్తుతం వ్యాపారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications