బెంగళూరు: మనం కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని, సుదీర్ఘ లాక్ డౌన్ ఉంటే ఈ మహమ్మారితో చనిపోయిన వారి కంటే భోజనం లేక చనిపోయేవారి సంఖ్య పెరుగుతుందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హెచ్చరించారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్స్కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులను రక్షిస్తూనే, సామర్థ్యం కలిగిన వారిని తిరిగి వర్క్ చేసేందుకు సిద్ధమవ్వాలన్నారు.

లాక్ డౌన్ వల్ల ఆకలు చావులు పెరుగుతాయి
ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ సరైన నిర్ణయమేనని, కానీ ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం కరోనా వల్ల మృతి చెందిన వారి కంటే ఆకలితో చనిపోయే వారి సంఖ్య పెరుగుతుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగడం సరికాదన్నారు. లాక్ డౌన్ పొడిగిస్తూ పోతే ఏదో ఒకరోజు వైరస్ కంటే ఆకలి మరణాలు పెరుగుతాయన్నారు. ఆయన హబుధవారం బిజినెస్ లీడర్స్తో మాట్లాడారు.

ఇండియా పరిస్థితి బెట్టర్..
అభివృద్ధి దేశాలతో పోలిస్తే భారత దేశం పరిస్థితి బాగుందని నారాయణమూర్తి అన్నారు. మన వద్ద మరణాల రేటు 0.25 శాతం నుండి 0.5 శాతం మాత్రమే ఉందన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే కరోనా వ్యాప్తిని చాలా వరకు నిరోధించామని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఇండియాలో ప్రతి సంవత్సరం 90 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, ఇందులో నాలుగింట ఒక వంతు మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాల్లో భారత్ ఒకటి అన్నారు.

జీవనోపాధి కోల్పేయే అవకాశం
ఏడాదిలో 9 మిలియన్ల మందితో పోలిస్తే ఈ రెండు నెలల్లో వెయ్యి మంది చనిపోయారని, ఇది అంత ఆందోళనకర విషయం కాదని మూర్తి అన్నారు. మన దేశంలో 190 మిలియన్ల మంది అసంఘటిత రంగం లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ ఇలాగే పొడిగించుకుంటూ వెళ్తే వీరు జీవనోపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎక్కువ కాలం కొనసాగితే ఎక్కువ మంది ఉపాధి కోల్పోతారన్నారు.

కంపెనీలు, ప్రభుత్వ రెవెన్యూలో భారీ కోత
చాలా వ్యాపారాలు తమ ఆదాయంలో 15 శాతం నుండి 20 శాతం మేర కోల్పోయాయని, ఇది ప్రభుత్వ పన్నులు, జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపుతుందని మూర్తి అన్నారు. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ మన వృద్ధి రేటును 4.5 శాతం నుండి 1.9 శాతానికి కుదించిందని గుర్తు చేశారు. కరోనా వైరస్ కొత్త సాధారణ కారకమని మనం అంగీకరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ కొత్త మార్గాలు వెతకాలన్నారు. బలమైన టెస్ట్ కిట్స్ను రూపొందించాలన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications