2025లో టెక్ రంగంలో ఉద్యోగులు భారీ షాక్ కి లోనయ్యారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు లక్షల ఉద్యోగులను కోల్పోయి, ఉద్యోగుల భవిష్యత్తును గందరగోళం చేశారు. AI విప్లవం, ఆటోమేషన్ కారణంగా టెక్ ఉద్యోగ ప్రపంచం ఇప్పుడు సవాళ్లతో నిండింది.

ఈ సంవత్సరం చాలామందికి AI ఆధారిత భవిష్యత్తు ప్రారంభం అని ఆశలు ఇచ్చినప్పటికీ, టెక్ నిపుణుల కోసం ఇది తీవ్రమైన ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 176 కంపెనీల్లో 80,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారు, కరోనా తర్వాత టెక్ రంగంలో ఇది అత్యంత పెద్ద ఉద్యోగ కోత.
కంపెనీల లేఅాఫ్ వివరాలు ఇలా ఉన్నాయి:
ఇంటెల్: 25,000 ఉద్యోగాలు కోల్పోయింది, ఇది దాని ప్రపంచవ్యాప్తంగా సుమారు 20%
మైక్రోసాఫ్ట్: 15,000 ఉద్యోగాలు, ఈ సంవత్సరం పలు రౌండ్లలో కోతలు
TCS: 12,000 ఉద్యోగాలు, "నైపుణ్యాలు లోపం" కారణంగా కోతలు
మెటా, గూగుల్, అమెజాన్: కలిపి 20,000-25,000 ఉద్యోగాలు
క్లావియో: 2025 జూలై/ఆగస్టులో 20% ఉద్యోగాలను కోల్పోయింది
Red Hat: సుమారు 800 ఉద్యోగాలు
కోర్వో (సెమికండక్టర్లు): 250 ఉద్యోగాలు తొలగించబడినవి
సేల్స్ఫోర్స్, సిస్కో, ఒరాకిల్: లేఅాఫ్ ప్రకటించినప్పటికీ ఖచ్చిత సంఖ్య తెలియదు
ఇతర స్టార్టప్స్, చిన్న కంపెనీలు: 5,000-8,000 ఉద్యోగాలు, కోతలు అన్ని స్థాయిలలో విస్తరించాయని చూపిస్తున్నాయి
ఈ సంఖ్యలు టెక్ రంగంలో ఉద్యోగ కోతలు ఎంత పెద్ద స్థాయిలో జరిగాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కంపెనీల మార్పులు ఉన్నప్పటికీ, నిపుణులు చెబుతున్నట్టుగా ముఖ్యమైన కారణం AI. ఆటోమేషన్ వల్ల అనేక పనులు మనుషుల బదులు యంత్రాలు చేస్తుండటంతో ఉద్యోగాలపై పెద్ద దెబ్బ పడుతోంది.
ప్రస్తుతం టెక్ రంగంలో సాధారణ పనులు, మధ్యస్థ స్థాయి ఉద్యోగాలు ఆటోమేషన్ కారణంగా వేగంగా తగ్గిపోతున్నాయి. యంత్రాలు, AI సిస్టమ్స్ ఆ పనులను భర్తీ చేయడంతో వేలాది మంది ఉద్యోగులు పనిలేకుండా నిలిచిపోయారు. ఈ పరిస్థితి 'రెడండన్సీ' అనే సమస్యను తెచ్చింది, అంటే ఒకే పనికి ఎక్కువ మంది అవసరం లేకుండా పోవడం. అమెరికాలోనే ఈ ఏడాది అన్ని పరిశ్రమల్లో కలిపి 7,40,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోయారు, ఇందులో టెక్ రంగం కీలక పాత్ర పోషించింది. భారతదేశం కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేదు. ముఖ్యంగా మధ్య-కెరీర్లో ఉన్న ఉద్యోగులు అంటే ఇప్పటికే 7-15 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగుల భవిష్యత్తు కూడా అనిశ్చితంగా మారింది. ఎందుకంటే, ఈ స్థాయి ఉద్యోగాలు ఎక్కువగా రోజువారీ పనులపై ఆధారపడి ఉంటాయి. అలాంటి పనులను ఇప్పుడు AI సులభంగా చేస్తోంది.
లేఅాఫ్ ప్రక్రియ కూడా ఉద్యోగుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. చాలా మంది ఈ వార్తను చాలా కఠినంగా తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా 57% మంది ఉద్యోగులకు కంపెనీలు నేరుగా ముఖాముఖి ఏమి చెప్పకుండా, కేవలం ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం అందించాయి. అంతే కాకుండా, కొత్త అవకాశాలను వెతుక్కోవడానికి లేదా ఆర్థికంగా సర్దుబాటు చేసుకోవడానికి తగినంత సమయం ఇవ్వలేదు. కేవలం కొన్ని రోజులు లేదా వారాల ట్రాన్సిషన్ టైమ్ మాత్రమే ఇచ్చారు. ఫలితంగా, చాలా మంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి కుడా సమయం లేకుండా, ఆర్థిక ఒత్తిడి మరియు భవిష్యత్తుపై భయంతో ఈ పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది.
ప్రస్తుతం టెక్ రంగంలో ఉద్యోగుల కోసం ముఖ్యమైన సందేశం ఒక్కటే మళ్లీ నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి. పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు, ఈ AI విప్లవం కొత్త నైపుణ్యాలపై డిమాండ్ను వేగంగా పెంచుతోంది. ముఖ్యంగా AI ఇంజనీరింగ్, డేటా సైన్స్, సైబర్సెక్యూరిటీ, DevOps వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ మరోవైపు, పాత పద్ధతిలో ఉన్న సంప్రదాయ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అంటే, ఎవరు మార్పులకు అనుగుణంగా త్వరగా కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటారో వాళ్లకే భవిష్యత్తు సురక్షితం. లేనిపక్షంలో, ఈ వేగంగా మారుతున్న పరిశ్రమలో వెనుకబడిపోవాల్సి వస్తుంది.
ఇంకా కొన్ని కంపెనీలు ఉద్యోగ సంఖ్యలను సమీక్షిస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, 2025 లో గ్లోబల్గా లేఅాఫ్ సంఖ్య 1,00,000కి మించవచ్చు. ఆటోమేషన్ ద్వారా సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, AI విప్లవంలో మానవ మోసాలు అనవార్యంగా ఉన్నాయని గుర్తించబడింది. కాబట్టి ఉద్యోగులు త్వరగా కొత్త నైపుణ్యాలు అభ్యసించడం తప్పనిసరి.
2025లో టెక్ రంగం విపరీతంగా మారింది. AI ప్రవేశం, ఆర్థిక ఒత్తిళ్లు, పున నిర్మాణం కారణంగా లక్షల మంది ఉద్యోగులు కోల్పోయారు. ఈ పరిస్థితి ఉద్యోగులకు స్పష్టమైన సంకేతం 'నేటి రోజులో నేర్చుకోకుండా ఉంటే, రేపటి రోజుకు సిద్ధం కావలసిన అవసరం ఉంది'.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications