Gold అమ్మే కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్ల దాడి.. 13 శాతం పెరిగిన స్టాక్..!
Kalyan Jewellers: మామూలుగా బంగారంపై పెట్టుబడి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తుందని మనందరికీ తెలుసు. అయితే గోల్డ్ విక్రయ వ్యాపారంలో దేశంలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ షేర్లు రాకెట్ లాగా మార్కెట్లో దూసుకుపోయాయి.
కల్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో 13 శాతానికిపైగా లాభపడ్డాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో షేర్లు గరిష్ఠంగా రూ.129.65 రేటును తాకాయి. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల గరిష్ఠానికి చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో 4.4 కోట్ల కంటే ఎక్కువ షేర్లు చేతులు మారాయి.

ప్రీ ట్రేడింగ్ సెషన్లో నేడు బ్లాక్ డీల్ ద్వారా 64 లక్షల షేర్లు చేతులు మారటంతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లపై దృష్టి సారించారు. కంపెనీ మెుత్తం షేర్లలో ఇవి 6.2 శాతం వాటాకు సమానమైన షేర్లు. మెుత్తం డీల్ విలువ రూ.725 కోట్లుగా తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావటంతో కల్యూణ్ జ్యువెలర్స్ షేర్లలో బజ్ మెుదలైంది. గత నెలలో జ్యువెలర్ షేర్లు ఏకంగా 17 శాతం మేర లాభపడ్డాయి. ఏడాది కిందట కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించిన వారు దాదాపు 117 శాతం రాబడిని పొందారు. అంటే వారి డబ్బు డబుల్ అయ్యిందన్నమాట.
కళ్యాణ్ జ్యువెలర్స్ భారతదేశంలోని అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్లలో ఒకటి. దీనికి మధ్యప్రాచ్యంలో కూడా వ్యాపారం ఉంది. పసిడి ప్రియుల విభిన్న అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా గోల్డ్, డైమండ్ నగలతో పాటు విలువైన రాళ్లతో కూడిన సాంప్రదాయ, సమకాలీన ఆభరణాల శ్రేణిని అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీకి 182 షోరూమ్లు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23) రూ. 14,071 కోట్ల ఆదాయంతో పాటు రూ.457 కోట్ల పన్నుల తర్వాత లాభాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications