ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో కొత్త ముఖాలలో టెక్స్టైల్స్, చక్కెర తయారీదారు KPR మిల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ - 74 ఏళ్ల KP రామసామి(KP Ramasamy) ఒకరు. ఆయన రూ.19,133.7 కోట్ల నికర విలువతో జాబితాలో 100వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఒక రైతు కొడుకు, కాలేజీ డ్రాపౌట్ అయిన KP రామసామి భారతదేశంలోని అతిపెద్ద గార్మెంట్ ఎగుమతి సంస్థలలో ఒకదానిని స్థాపించడం ద్వారా విజయం సాధించారు. 1984లో స్థాపించిన KPR మిల్ వ్యాపారాన్ని 2013లో రామసామి విస్తరించారు. చక్కెర ఉత్పత్తికి విస్తరించారు.
2019లో ఆయన పురుషుల ఇన్నర్వేర్ బ్రాండ్ అయిన ఫాసోను కూడా ప్రారంభించాడు. KPR మిల్ అల్లిన దుస్తులు, పత్తి, పాలిస్టర్ నూలు ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది కాకుండా, KPR మిల్ చక్కెర, ఇథనాల్ తయారీలో కూడా ఉంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం KPR మిల్స్ వార్షికంగా 128 మిలియన్ వస్త్రాల ఉత్పత్తిని కలిగి ఉంది. వస్త్రాలు క్రీడా దుస్తులు, స్లీప్వేర్లతో సహా విస్తృత శ్రేణిని కలిగి ఉంటాయి. అవి ఎక్కువగా H&M, మార్క్స్ & స్పెన్సర్, వాల్మార్ట్ వంటి ప్రపంచ రిటైల్ దిగ్గజాల షెల్ఫ్లకు విక్రయిస్తున్నారు.

భారతదేశంలోని 100 మంది ధనవంతుల ఫోర్బ్స్ జాబితాలోని ఇతర కొత్త పేర్లను పరిశీలిస్తే, ఆసియన్ పెయింట్స్ డాని ఫ్యామిలీ రూ.67,841.77 కోట్ల నికర విలువను కలిగి ఉంది. అప్పు చేసి వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'రామసామి' వ్యాపారాన్ని చూసుకోవడానికి అతని కొడుకు 'ఆనందకృష్ణన్' విదేశాలను వదిలి ఇండియా చేరుకున్నారు. సంస్థ అభివృద్ధి కోసం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు.
ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ఇండియా యొక్క 100 మంది సంపన్నుల జాబితా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ $92 బిలియన్లతో మొదటి స్థానంలో నిలిచారు. అతని తర్వాతి స్థానంలో అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ నికర విలువ $68 బిలియన్లు, HCL వ్యవస్థాపకుడు శివ్ నాడార్ $29.3 బిలియన్ల నికర విలువతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..



Click it and Unblock the Notifications