Kotak Mahindra Bank: బుధవారం దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ సంచలన ఆంక్షలు విధించింది. బ్యాంక్ టెక్నికల్ సెక్యూరిటీ విషయంలో ఆందోళనలను లేవనెత్తుతూ ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్ల ద్వారా కొత్త కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే బ్యాంక్పై ఆర్బీఐ తీసుకున్న చర్య తర్వాత గురువారం కంపెనీ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ పుట్ ఆప్షన్ ట్రేడింగ్ కారణంగా కొంతమంది పెట్టుబడిదారులు ధనవంతులయ్యారు. ఏప్రిల్ 24 మధ్యాహ్నం 3.11 గంటలకు ఒక వ్యాపారి 18 లాట్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేశాడు. అతను కేవలం రూ.1,000 పెట్టుబడి పెట్టి ఒక రోజులో రూ.20 లక్షల వరకు సంపాదించినట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి డెరివేటివ్ కాల్స్ నేడు వారాంతపు గడువు ముగింపు తేదీ కారణంగా షార్ట్ కాంట్రాక్ట్ల ధర 104 శాతం నుండి 71,600 శాతానికి పెరిగింది. దీంతో అతడి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది.

ఒక ఉదాహరణ ప్రకారం.. KOTAKBANK APR 1700 PE నిన్నటి ముగింపు స్థాయి 20 పైసల నుంచి నేడు రూ.60కి పెరిగింది. ఇది 29,900 శాతం పెరుగుదల. ఇదే సమయంలో కోటక్బ్యాంక్ APR 1660 PE నిన్నటి ముగింపు స్థాయి 5 పైసల నుంచి నేడు రూ.17.05కి పెరిగింది. ఇది 34,000 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే కోటక్బ్యాంక్ APR 1680 PE మునుపటి ముగింపుతో పోలిస్తే 5 పైసలు పెరిగి రూ.35.85 వద్ద ముగిసింది. ఇది 71,600 శాతం రాబడిని సూచిస్తుంది. స్టాక్ విలువలో పతనాన్ని ఆశించే ఇన్వెస్టర్లు PE కాల్స్ కొనుగోలు చేస్తుంటారు.
సెంట్రల్ బ్యాంక్ ప్రకారం IT ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్యాచ్ & చేంజ్ మేనేజ్మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ కఠినత వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నాన్-కాంప్లియెన్సులు ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ గమనించింది. RBI రెగ్యులేటరీ గైడ్లైన్స్ కింద ఉన్న అవసరాలకు విరుద్ధంగా, బ్యాంకు తన ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్లో లోపభూయిష్టంగా ఉన్నట్లు వరుసగా రెండు సంవత్సరాలుగా అంచనా వేయబడింది.


Click it and Unblock the Notifications