IPO News: చౌక ఐపీవో సూపర్ లాభాలు.. తొలిరోజే సంతోషంలో ఇన్వెస్టర్లు..
IPO News: నిన్న మార్కెట్ల అతలాకుతలం నుంచి తేరుకున్న క్రమంలో నేడు ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఒక ఐపీవో ప్రవేశించింది. మెుదటి రోజే 31 శాతానికి పైగా రాబడిని అందించటంతో ఇన్వెస్టర్లు సంతోషంలో తేలియాడుతున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది కొంటోర్ స్పేస్ ఐపీవో గురించే. తొలి రోజునే ఇన్వెస్టర్లకు 31 శాతం లాభం అందించింది. కొంటోర్ స్పేస్ NSE SME కేటగిరీలో రూ.122 వద్ద జాబితా చేయబడింది. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరును రూ.93 రేటుకు విక్రయించింది. ఈ ఐపీవో సెప్టెంబర్ 27, 2023న ప్రారంభమై అక్టోబర్ 3, 2023 వరకు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంది.

మార్కెట్లో బలమైన లిస్టింగ్ తర్వాత షేర్లు ప్రాఫిట్ బుకింగ్ను ఎదుర్కొన్నాయి. దీంతో స్టాక్ 5 శాతం మేర క్షీణించి రూ.115.90 వద్ద ఉంది. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణం 1200 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా ఈ ఐపీవోలో ఒక లాట్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.1,11,600 వెచ్చించారు. IPO నాల్గవ రోజున 70.97 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వం పొందింది. రిటైల్ విభాగంలో చివరి రోజున 95.49 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ పరిశీలిస్తే రూ.7,162 కోట్లుగా ఉంది.
ఈ కంపెనీ 2018లో స్థాపిచబడింది. ఇది స్థలాన్ని అద్దెకు ఇవ్వటం, నిర్వహించటం వంటి సేవలను కంపెనీలకు అందిస్తుంది. తద్వారా అద్దె, లీజు, సబ్ లీజు రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఫర్నిచర్డ్ లేదా ఫర్నిచర్ లేకుండా కంపెనీల అవసరాల మేరకు ఆఫీసు స్థలాలను అందిస్తుంది. వ్యాపారాల అవసరాలకు అనుగుణంగా ప్రాపర్టీలను రెనోవేట్ చేయటం, మోడ్రనైజ్ చేయటం చేపడుతుంది. అలాగే మహారాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో కోవర్కింగ్ స్పేసెస్ నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications