Nandini Ghee Issue: తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం ప్రపంచ వ్యాప్తంగా ఆ గోవిందుడి భక్తులను మనోవేదనకు గురిచేస్తోంది. స్మామివారికి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో ప్రసాదాన్ని వండి సమర్పించటారన్న విషయం తాజాగా నెయ్యి నాణ్యతా పరీక్షల్లో వెల్లడైంది. అయితే ఈ వివాదంతో ప్రస్తుతం గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై భక్తులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కొనుగోలు చేసే కంపెనీని మార్చడమే ఇందుకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. గత జూలైలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో అనేక అంశాల్లో నాణ్యత తగ్గించినట్లు భక్తుల నుంచి వచ్చిన ఆరోపణలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే నెయ్యి నాణ్యత విషయం తనిఖీల్లో బయటపడింది. తిరుమల లడ్డు ప్రపంచ గుర్తింపును సంతరించుకుంది. దాని నాణ్యత, రుచి, పవిత్రతకు కోట్లాదిమంది భక్తులు దాసోహం అని చెప్పుకోక తప్పదు. ఈ క్రమంలో తయారీలో వినియోగించే నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి కొనుగోలు చేసేందుకు వివిధ కంపెనీల నుంచి కాంట్రాక్టులు కోరుతోంది. ఇలా కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచి లక్షల కిలోల్లో నెయ్యి కొనుగోలు చేస్తుంటుంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పాల సహకార సంస్థ అయిన నందిని నుంచి నెయ్యి కొనుగోలు చేసేవారు. దాదాపు 15 ఏళ్లుగా తిరుపతి తిరుమల దేవస్థానానికి నందిని కంపెనీ నెయ్యి విక్రయిస్తోంది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నందిని నుంచి నెయ్యి సేకరణను నిలిపివేసింది. ఎందుకంటే గతేడాది జరిగిన నెయ్యి కొనుగోళ్ల కాంట్రాక్ట్ పాయింట్లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని పాల్గొనలేదు.
దీనికి ప్రధాన కారణం నందిన్ బ్రాండ్ యజమాని KKMF గత సంవత్సరం దాని పాలు, నెయ్యి ధరలను పెంచబడింది. అయితే తక్కువ రేట్లకు నెయ్యి అందించలేమంటూ పక్కకు తప్పుకుంది. దీంతో కాంట్రాక్టును మరో కంపెనీకి వెళ్లింది. వైసీపీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తిరుపతి దేవస్థానం పాలకవర్గాన్ని వేరే కంపెనీ నుండి నెయ్యి కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసిందని కూడా చెప్పబడింది. ఈ పరిస్థితిలోనే గత జూన్లో నెయ్యి నాణ్యత తక్కువగా ఉందని దేవస్థానం యంత్రాంగం గుర్తించి జాతీయ ప్రయోగశాలకు పంపింది. సదరు నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నట్లు నేషనల్ లాబొరేటరీ నివేదించింది.
ఈ వ్యవహారంపై కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ భీమా నాయక్ కూడా స్పందించారు. నందిని మార్కెట్లో అంత్యంత నాణ్యమైన నెయ్యిని అందిస్తోందని వెల్లడించారు. ఏదైనా కంపెనీ నెయ్యి మా కంటే తక్కువ ధరకు అందజేస్తే అది నాసిరకం నాణ్యతతో కూడుకున్నదేనని ఆయన స్పష్టం చేశారు. మెుత్తానికి ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీనిపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా స్పందించారు. స్వామివారి ప్రసాదాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజకీయ అవసరాల కోసం దేవుడిని సైతం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications