Budget 2024: బడ్జెట్ ప్రజెంటేషన్ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11కి ఎందుకు మార్చారో తెలుసా?
Budget Facts: వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రసంగానికి సిద్ధమౌతోంది. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ 2024-25ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న సమర్పించనున్నారు.
బడ్జెట్లో రానున్న ఏడాది కాలంలో భారతదేశ రాబడులు, ఖర్చుల వివరాలు ఉంటాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్ను జూలై 23న ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ను ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అంతకుముందు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు.

1999 వరకు వలసరాజ్యాల కాలం నాటి ఆచారం ప్రకారం కేంద్ర బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు లోక్సభలో సమర్పించేవారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం లండన్, భారత్లలో ఏకకాలంలో ప్రకటనలు చేయగలిగింది. భారత్ అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఇంగ్లండ్ కంటే 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. భారతదేశంలో ఉదయం 11:30 GMT సాయంత్రం 5 గంటలకు సమానం. కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పులు తీసుకురాలేదు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు చాలా కాలంగా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతులను అనుకరించాయి.
బడ్జెట్ సమర్పణకు కొత్త సమయాన్ని 1999లో తీసుకురావటం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్ను సమర్పించినప్పుడు సాయంత్రం 5 గంటల రొటీన్ను మొదటిసారి మార్చారు. తర్వాతి కాలంలోనే దానిని ప్రభుత్వాలు కొనసాగించటంతో బ్రిటీష్ కాలం నాటి పద్ధతులకు స్వస్థి పలకటం జరిగింది.
వాస్తవానికి అనేక కారణాల వల్ల ఈ మార్పు జరిగింది. భారతదేశం స్వాతంత్ర్యం తర్వాత దాని స్వంత సమయ క్షేత్రాన్ని అనుసరించడం ప్రారంభించింది. బడ్జెట్ను సమీక్షించడానికి చర్చించడానికి అధికారులు, పార్లమెంటు సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రభుత్వం ఉదయం బడ్జెట్ను సమర్పించే విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications