MOdi 3.0 Budget: రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రిగా 8వ సారి బడ్జెట్ ప్రసంగానికి ఆమె సిద్ధం అవుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే బడ్జెట్ ప్రసంగం రోజు కోసం సంసిద్ధం అవుతున్నాయి. అయితే గత బడ్జెట్ సమయంలో కూడా ప్రభుత్వ కేటాయింపులకు అనుగుణంగా మార్కెట్లు ప్రభావితం అయిన సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఈ సారి బడ్జెట్ 2025 నుంచి అంచనాలను తక్కువగా ఉంచుతున్నప్పటికీ.. ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ డౌన్బీట్, బలహీనమైన వినియోగం, నిదానమైన ప్రభుత్వ క్యాపెక్స్ నేపథ్యంలో కొత్త బడ్జెట్ వస్తోందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. మోదీ సర్కార్ వచ్చాక ఇది రెండవ బడ్జెట్ అయినప్పటికీ.. 3.0లో తొలి ఫుల్ టైమ్ బడ్జెట్ కావటం గమనార్హం. అందుకే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కువగా కసరత్తు చేయాల్సి ఉంటుంది.

మొదటి పూర్తి-సంవత్సర బడ్జెట్లు నిర్మాణాత్మక/వ్యూహాత్మక విధాన ఉద్దేశాన్ని సూచించడానికి ప్రభుత్వ ప్రయాణానికి సంబంధించిన బ్లూప్రింట్ను రూపొందించడానికి ఒక వేదికగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక ఆర్థిక లావాదేవీలను సమతుల్యం చేయటమే. ఈ క్రమంలో ఎన్డీఏ హయాంలో 2015 నుంచి 2019 ఆర్థిక సంవత్సరాలకు మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లు భారతీయ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ హయాంలో గత బడ్జెట్లు ఆర్థిక ఏకీకరణ, జీఎస్టీ అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని నొక్కి చెప్పటంతో పాటు వృద్ధికి పునాది వేశాయి.
మోదీ హయాంలో ప్రవేశపెట్టిన తర్వాతి బడ్జెట్లు తయారీ రంగం, ఆత్మ-నిర్భర్ భారత్, కార్పొరేట్ పన్ను తగ్గింపులు, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలపై దృష్టి సారించాయి. దేశీయ సైక్లికల్స్, క్యాపిటల్ గూడ్స్, ప్రైవేట్ బ్యాంకుల్లో బలమైన మార్కెట్ క్యాప్ చూశాం. రీక్యాపిటలైజేషన్ ద్వారా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు బలంగా పుంజుకున్నాయని బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. ఈ క్రమంలో గడచిన దశాబ్ధకాలంగా ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో వినియోగాన్ని పెంచటం వల్ల ఉండే తక్కువ ప్రయోజనం నుంచి సరఫరా వైపు సంస్కరణ వ్యూహాన్ని అందిపుచ్చుకుంది.
మోదీ సర్కార్ దేశంలోని రవాణా వ్యవస్థలను మెరుగుపరచటంపై కూడా భారీగానే ఫోకస్ పెట్టింది. FY14-FY24 మధ్య కాలంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 6 రెట్లు పెంచగా.. రైల్వేల కోసం 8 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. 2019-20లో ప్రకటించిన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ద్వారా ఈ ప్రయత్నాలు విస్తరించబడ్డాయి. సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు దీనివల్ల అధికంగా లాభపడ్డాయి. దీని స్టాక్ మార్కెట్లలో వివిధ రంగాలతో పాటు అనేక కంపెనీల షేర్లపై పెట్టుబడిదారులు బడ్జెట్ ప్రకటనలతో మంచి లాభాలను అందుకున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications