Best Performing Funds: సాధరణంగా మనలో చాలా మంది బ్యాంకులు ఇచ్చే 6 శాతం వడ్డీ కోసం ఆశపడుతుంటాం. అయితే మ్యూచువల్ ఫండ్స్ 60 శాతానికి పైగా రాబడిని అందించటం గురించి అరుదుగా వింటుంటాం. చాలా మందికి సరైన ఫండ్స్ ఎంచుకోవటంపై అవగాహన లేకపోవటంతో ఈ స్థాయిలో రాబడులను పొందలేకపోతుంటారు. ఊళ్లో వచ్చే రెండు రూపాయల వడ్డీ కంటే డబుల్ రాబడిని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు గమనిస్తే..
సెప్టెంబర్ 2024లో దాదాపు సగం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు వాటి బెంచ్మార్క్లను అధిగమించాయి. నెలాఖరు నాటికి మొత్తం 137 ఫండ్లు తమ బెంచ్మార్క్లను అధిగమించాయని ప్రభుదాస్ లీలాధర్ వెల్త్ మేనేజ్మెంట్ ఇటీవల ఒక రిపోర్టులో వెల్లడించింది. దీంతో ఈక్విటీ ఫండ్స్ కింద దేశంలో పెట్టుబడులు ఆగస్టులో సెప్టెంబర్ కంటే 3.1 శాతం పెరిగి రూ.25.64 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది దేశంలోని మ్యూచువల్ ఫండ్లలోకి ప్రవేశిస్తున్న ప్రజల డబ్బును సూచిస్తోంది. కేటగిరీల వారీగా వివిధ పథకాల పనితీరును పరిశీలిస్తే..

లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో క్వాంట్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ ఏడాది కాలంలో 45.88% ఆకట్టుకునే రాబడిని అందించింది. దీని తర్వాత బరోడా BNP పారిబాస్ లార్జ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 45.16%, బంధన్ లార్జ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 44.23% రాబడిని అందించి టాప్ స్థానాల్లో ఉన్నాయి. ఇదే క్రమంలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీని పరిశీలిస్తే.. ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 61.08 శాతం రాబడిని అందించగా, మోతీలాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 60.53 శాతం రాబడిని అందించింది.
ఇక ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీని పరిశీలిస్తే మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 62.83 శాతం రాబడిని అందిచంగా, జేఎమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 59.04 శాతం రాబడిని అందించింది. ఇదే క్రమంలో మిడ్ క్యాప్ కేటగిరీలో బెస్ట్ రాబడిని ఇచ్చిన ఫండ్స్ గురించి పరిశీలిస్తే.. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 71.80 శాతం రాబడిని అందించగా, ఎడీల్వెస్సీ మిడ్ క్యాప్ ఫండ్ 60.25 శాతం, ఐటీఐ మిడ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ 61.47 శాతం రాబడిని అందించింది. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ కేటగిరీని పరిశీలిస్తే.. బాంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 72.13 శాతం రాబడితో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 59.54 శాతం రాబడిని అందించింది.
ఇక వ్యాల్యూ కాంట్రా డివిడెండ్ ఈల్ట్ ఫండ్లలో క్వాంట్ వ్యాల్యూ ఫండ్67.04 శాతం రాబడిని అందిస్తోంద. ఇక ELSS స్కీమ్స్ పనితీరును పరిశీలిస్తే.. మోతీలాల్ ఓస్వాల్ ELSS ట్యాక్స్ సేవర్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 66.56 రాబడితో అసాధారణ ఫలితాలను అందించి ఈ కేటగిరీలో తొలిస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానంలో ఎస్బీఐ టెర్మ్ ఈక్విటీ ఫండ్ 54.46 శాతం రాబడిని అందించి ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..



Click it and Unblock the Notifications