Success Story: ఆధునిక యుగంలో చాలా మంది మహిళలు చదువుకుంటూనే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. గుర్గావ్కు చెందిన 29 ఏళ్ల నీలం సింగ్ సైతం ఈ కోవకు చెందిన వారే. చిన్న వయస్సులోనే వ్యాపారాన్ని ప్రారంభించి రూ.40 కోట్ల బిజినెస్ చేస్తోంది. కాలేజీ రోజుల్లో ఎంట్రప్రెన్యూర్ కావాలనే బలమైన కోరికతో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె ఎలా సక్సెస్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

నీలమ్ సింగ్ ప్రయాణం..
నీలం సింగ్ గుర్గావ్లో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి ఒక పాఠశాల ప్రిన్సిపల్. ఆమె దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి బి.కామ్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ICFAI (IBS)లో MBA పూర్తి చేశారు. ఎంబీఏ మార్కెటింగ్ పూర్తిచేసిన తర్వాత జెన్ పాక్ట్ సంస్థలో రూ.5 లక్షల జీతానికి పనిచేశారు. అలా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసిన తర్వాత 2016లో ఉద్యోగం మానేశారు. ఉద్యోగంలో తన వ్యాపారానికి అవసరమైన ధనాన్ని కూడబెట్టుకున్నారు.

ఆహార రంగంలోకి..
ఎంబీఏ చదువుకుంటున్న రోజుల్లోనే నీలమ్ సింగ్ ఫాస్ట్ ఫుడ్ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కాలేజీలో జరగే మూడురోజుల ఫెస్ట్ సమయంలో చిన్న రెస్టారెంట్ నిర్వహించి ఏకంగా రూ.లక్ష సంపాదించింది. తన ఉద్యోగ సమయంలో దాచిన డబ్బుతో 2018లో గుర్గావ్లో ది బర్గర్ కంపెనీని ప్రారంభించింది. అలా గుర్గావ్ ఫోరమ్ మాల్ లో తన మెుదటి దుకాణాన్ని తెరిచింది.

రూ.40 కోట్ల ఆదాయం..
ప్రయాణాన్ని చిన్నగా ప్రారంభించినప్పటికీ ఐదేళ్లలో ది బర్గర్ కంపెనీ ఆదాయం రూ.40 కోట్లకు చేరుకుంది. కరోనా సమయంలో చాలా మంది తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆలోచిస్తున్న సమయంలో అక్టోబర్ 2020లో ఫ్రాంచైజీ మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత సింగ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన నితేష్ థాంకర్ను వివాహం చేసుకుంది. నితేష్ అమిటీ యూనివర్సిటీ నుంచి MBA గ్రాడ్యుయేట్, విజయవంతమైన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ కూడా.

100 అవుట్ లెట్లతో ముందుకు..
ప్రస్తుతం కంపెనీ ఢిల్లీ NCR సహా ఏడు రాష్ట్రాలకు విస్తరించి 100 అవుట్లెట్లను కలిగి ఉంది. కంపెనీ రూ.39 నుంచి రూ.239 వరకు ధరల శ్రేణిలో బర్గర్లను కస్టమర్లకు అందిస్తోంది. దీంతో అందరికీ అందుబాటు ధరల్లో రుచికరమైన ఆహారాన్ని అందించే వ్యాపారాన్ని ప్రారంభించాలన్న నీలం సింగ్ కల ఇప్పుడు నెరవేరిందని చెప్పుకోవాలి. చిన్న సంస్థగా ప్రారంభమై ప్రస్తుతం రూ.40 కోట్ల టర్నోవర్ అందుకునే స్థాయికి చేరుకోవటంతో సింగ్ తన వ్యాపార ప్రయాణాన్ని విజయవంతంగా నడుపుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications