Ather Scooters: రాబోతున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగం. దీనిని అందిపుచ్చుకునేందుకు దశాబ్ధానికి పైగానే చాలా మంది తమ ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే ఆలోచనను నమ్మి ఫండింగ్ చేసేవారు కొరవడ్డా విజయవంతమైన కంపెనీ స్టోరీ చూడండి..
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంపెనీ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ సక్సెస్ గురించే. వీరిద్దరూ ఐఐటీ మద్రాస్ నుంచి విద్యను పూర్తి చేశారు. వీరు వాహన రంగంలోని కంపెనీల్లో చదువు పూర్తయ్యాక పనిచేసిన అనుభవంతో ఈవీ రంగంవైపుకు మళ్లారు. అలా 2013లో తమ వ్యాపార ప్రయాణాన్ని మెుదలు పెట్టారు.

వీరు భారత మార్కెట్లకు అనుగుణంగా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి విక్రయించాలనే ఆలోచనతో ముందుకు సాగారు. అలా అత్యుత్తమ పనితీరు, జీరో మెయింటెనెన్స్, స్మార్ట్ స్కూటర్లను తయారు చేయటంపై శ్రద్ధ పెట్టారు. అలా 2018లో ఏథర్ 450ని మార్కెట్లోకి మెుదటగా విడుదల చేశారు. ఆ తర్వాత అప్ గ్రేజెడ్ వర్షెన్స్ విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈవీ కంపెనీ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అయితే వీరి ప్రయత్నాలు మాత్రం 2009 నుంచే ఈ రంగంపై ప్రారంభమయ్యాయి.
2014లో కంపెనీ ఐఐటీ మద్రాస్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ నుంచి రూ.45 లక్షలు ఫండింగ్ అందుకుంది. అయితే స్టార్టప్ దశలో ద్వితీయార్థంలో నిధుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో కంపెనీ నిధుల కోసం చేసిన అనేక ప్రయత్నాలు తిరస్కరణకు గురయ్యాయి. తొలుత వీరు ఏథర్-S340 నిర్మాణంపై పనిచేశారు. ఆ సమయంలో ఫిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్కు ఒక మెయిల్ పంపారు. తమ స్టార్టప్ కలను బతికించుకునేందుకు రూ.30 లక్షల పెట్టుబడిని కోరారు. ఆ సమయంలోనే భారత ఈవీ అమ్మకాలు లక్ష యూనిట్ల నుంచి 15 వేల యూనిట్లకు పడిపోయాయి.
అయితే సచిన్ బన్సల్ నుంచి వారికి ఊహించని జవాబు వచ్చింది. ఫిప్ కార్ట్ లోని ఇతరులతో కలిసి ఏకంగా ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడిగా అందించారు. ఇది ఏథర్ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత మే 2015లో స్టార్టప్ టైగర్ గ్లోబల్ నుంచి 12 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ప్రస్తుతం కంపెనీ దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే అమ్మకాల పరంగా దేశంలోని టాప్-5 ఈవీ టూవీలర్ కంపెనీగా ఏథర్ నిలిచింది. అలాగే కంపెనీకి ప్రస్తుతం హీరో మోటార్స్ సైతం వెన్నుముకగా నిలిచింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications