Success Story: వ్యాపార దక్షత, అందులోని మెళకువలు తెలిసిన వారికి విద్యతో సంబంధం లేదని ఈ సక్సెస్ స్టోరీ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్న రాజేష్ గాంధీ విజయగాథ..
రాజేష్ గాంధీ వాడిలాల్ ఇండస్ట్రీస్ చైర్మన్. 1979లో ఆయన కంపెనీలో చేరిన నాల్గవ తరం వ్యాపారవేత్త. రాజేష్ ఆధ్వర్యంలో వాడిలాల్ 90వ దశకం ప్రారంభంలో అనేక రాష్ట్రాల్లో కోల్డ్-చైన్ నెట్వర్క్ను ఆప్టిమైజ్ చేయడానికి ప్రాసెస్ చేసిన ఆహార పరిశ్రమలోకి ప్రవేశించింది. కంపెనీ సూపర్ మార్కెట్లు కాకుండా దాని ఫ్రాంఛైజ్ ఆధారిత హ్యాపిన్నెజ్ ఐస్ క్రీం పార్లర్ల ద్వారా రిటైల్ ఉనికిని కలిగి ఉంది. కంపెనీ రుచికరమైన కోన్లు, క్యాండీలు, బార్లు, కప్పులు, ఫ్యామిలీ ప్యాక్లతో సహా అనేక రూపాల్లో ఐస్క్రీంను ఉత్పత్తి చేస్తోంది.

ప్రముఖ ఐస్ క్రీం కంపెనీని 1907లో వాడిలాల్ గాంధీ స్థాపించారు. గుజరాత్ అహ్మదాబాద్లోని ఒక చిన్న వీధి సోడా దుకాణంతో వీరి ప్రస్థానం ప్రారంభమైంది. కంపెనీకి 1972-73 వరకు అహ్మదాబాదులో 8-10 అవుట్లెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత వారు ఇతర ప్రాంతాలకు విస్తరించారు. 1985 నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ లకు సైతం విస్తరించారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.1,843 కోట్లుగా ఉంది. అలాగే సోమవారం కంపెనీ స్టాక్ ధర రూ.2,545.50 వద్ద ఉంది. ప్రస్తుతం వాడిలాల్ దేశంలోని ప్రముఖ ఆహార మరియు పానీయాల కంపెనీల్లో ఒకటి ఉంది.
ప్రస్తుత ఛైర్మన్ గాంధీ తన పాఠశాల విద్యను అహ్మదాబాద్లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్ లయోలా హాల్లో పూర్తి చేశారు. తాను తొమ్మిదో తరగతి ఫెయిల్ అయ్యానని.. బయటకు వెళ్లి కొత్త పాఠశాలలో పదో తరగతిలో చేరాలనుకుంటున్నానని ఒకసారి ఫార్చ్యూన్ ఇండియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే తండ్రి మాట మేరకు మరోసారి తొమ్మిదో తరగతి చదివినట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications